Gujarat Shocker: నేను మగాడిని కాదని నా భార్యకు పెళ్లికి ముందే తెలుసు, అయినా అప్పుడు పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆస్తి కోసం ఇప్పుడు నాటకాలు ఆడుతోంది, గుజరాత్ భార్య ఆరోపణలను ఖండించిన ఆమె భర్త

గుజరాత్ వడోదరలో నా భర్త మగాడు కాదని పోలీసులకు ఓ భార్య ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో షాకింగ్ విషయాలను ఆమె భర్త మీడియాకు వెల్లడించారు.

Dr Viraj Vardhan. (Photo Credits: ANI)

Vadodara, Sep 19: గుజరాత్ వడోదరలో నా భర్త మగాడు కాదని పోలీసులకు ఓ భార్య ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో షాకింగ్ విషయాలను ఆమె భర్త మీడియాకు వెల్లడించారు. నేను మగాడిని కాదనే విషయం నా భార్యకు ముందే తెలుసని, అంతేకాదు తాను లింగమార్పిడి సర్జరీలకు ( Gender Reassignment Surgery) వెళ్తున్నాననే విషయం కూడా ఆమెకు తెలుసని డాక్టర్‌ విరాజ్‌వర్థన్‌ తెలిపారు. భార్య అతనిపై చేసిన ఆరోపణలను (Husband Denies) ఖండించాడు.

ఆమె, ఆమె బిడ్డ నాకు ఎంతో దగ్గరయ్యారని, అంతేకాదు ఆమె కూతురిని తాను దత్తత కూడా తీసుకున్నానని ఆయన మీడియాకు వెల్లడించారు.తన లోపాన్ని సాకుగా చూపించి ఇల్లు తనపేరిట రాయాలంటూ ఆమె ఆ టైంలో డిమాండ్‌ చేసింది. ఇవ్వడం కుదరనే సరికి ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకుంది. కానీ, కొన్నాళ్లకు కూతురు వంకతో మళ్లీ వచ్చింది. పెద్దల సమక్షంలో ఎలాగోలా వివాహం జరిగింది. అంతా తెలిసి ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత (Wife Finds After 8 Years) ఆమె నేను విషయం దాచానంటూ మీడియా ముందుకు రావడం ఆశ్చర్యంగా ఉంది అని విరాజ్‌ అలియాస్‌ విజేత పేర్కొన్నారు.

శృంగారం కోసం రూంలోకి పిలిచిన భార్య, ఎనిమిదేళ్లుగా తప్పించుకు తిరిగిన భర్త, కట్ చేస్తే మగాడిని కాదంటూ సర్జరీకి వెళుతున్నానంటూ షాక్, భార్య ఏం చేసిందంటే..

పెళ్లైనప్పటి నుంచి తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నామని, అసహజ లైంగిక చర్యలో పాల్గొన్న ఆరోపణలను సైతం ఆయన ఖండించారు. అయితే.. గత ఏడాది కాలంగా మాత్రం వేర్వేరు గదుల్లో పడుకుంటున్నామని, ఆమె తన గదిలో సీసీకెమెరా ఇన్‌స్టాల్‌ చేసి రహస్యంగా ఫొటోలు తీయడం ప్రారంభించిందని, ఈ ఏప్రిల్‌ నెలలో తన సోదరుడితో వచ్చి ఆ ఫొటోలు చూపించి ఆస్తి తన పేరిట రాయాలని బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించిందని చెప్పారాయన. తాను పుట్టుకతో మహిళనే విషయం తెలిపిన విరాజ్‌.. పెళ్లికి ముందే ట్రాన్స్‌జెండర్‌ అయ్యానని, ప్రస్తుతం పురుషుడిగా మారేందుకు సర్జరీలు చేయించుకుంటున్నాననే విషయాన్ని అంగీకరించారు.

గుజరాత్‌ వడోదర సయాంజిగంజ్‌కు చెందిన సదరు మహిళకు గతంలో పెళ్లై.. ఓ కూతురు ఉంది. అయితే భర్త చనిపోయాక 2014లో మ్యాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా ఢిల్లీకి చెందిన డాక్టర్‌ విరాజ్‌తో వివాహం జరిగింది. అయితే తన భర్త మగవాడు కాదని.. ఆపరేషన్‌ ద్వారా మారిన స్త్రీ అంటూ గోత్రీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Share Now
Advertisement