
Hyderabad, Mar 4: స్లీపర్, ఏసీ బోగీల్లో (AC Coaches) ప్రయాణం కోసం బెర్త్ రిజర్వు చేసుకున్నారు. అయితే అది కన్ఫాం కాలేదు. దీంతో మీరు వెయిటింగ్ లిస్ట్ (Waiting List) లో ఉన్నారు. ప్రయాణ సమయం ముంచుకొచ్చింది. ఏం చేస్తాం? రైలులో స్లీపర్, ఏసీ ఇలా ఏ బోగీ దొరికితే అందులో ప్రయాణిస్తాం. ఇది సాధారణమే కదూ. అయితే ఇకపై వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించడానికి ఈ టికెట్లు చెల్లవు. ఒకవేళ వెయిటింగ్ లిస్టెడ్ టికెట్లతో స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా చెల్లించక తప్పదు. ఈ మేరకు రైల్వేశాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు ఇకపై జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించాలని కొత్త రూల్స్ చెప్తున్నాయి. ఈ నెల 1 నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
రాజమహేంద్రవరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి.. ప్రమాద సమయంలో పడవలో 12 మంది (వీడియో)
జరిమానా ఇలా..
వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులు ఆ టికెట్లతో ఏసీ బోగీలో ప్రయాణిస్తే, ఆ రైలు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడి నుంచి తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని, రూ.440 ఫైన్ ను చెల్లించాలి. స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే, రూ.250 జరిమానాతోపాటు, తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని చెల్లించాలి.