COVID-19 Update: దేశవ్యాప్తంగా కొత్తగా మరో 1,975 పాజిటివ్ కేసులు నమోదు, భారతదేశంలో 26,917కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, 826కు పెరిగిన కరోనా మరణాలు
కరోనా తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో కోవిడ్-19 కేసుల సంఖ్య 7,628 దాటింది. అలాగే రాష్ట్రం నుంచి కరోనా మరణాల సంఖ్య 323గా ఉంది. మహారాష్ట్రలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం ముంబై, పుణె మరియు థానే నగరాల నుంచే ఉన్నాయి. ఒక్క ముంబై నగరం నుంచే......
![COVID-19 Update: దేశవ్యాప్తంగా కొత్తగా మరో 1,975 పాజిటివ్ కేసులు నమోదు, భారతదేశంలో 26,917కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, 826కు పెరిగిన కరోనా మరణాలు](https://test1.latestly.com/wp-content/uploads/2020/04/Coronavirus-in-India-2-1024x569.jpg)
New Delhi, April 26: శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 1,975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో COVID-19 బాధితుల సంఖ్య ఆదివారం నాటికి 26,917 కు చేరుకున్నాయి. అదే సమయంలో కరోనావైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 826కి పెరిగింది. కాగా, ఈరోజు 111 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,914 కరోనావైరస్ బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20,177 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.
ఇక కరోనా తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో కోవిడ్-19 కేసుల సంఖ్య 7,628 దాటింది. అలాగే రాష్ట్రం నుంచి కరోనా మరణాల సంఖ్య 323గా ఉంది. మహారాష్ట్రలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం ముంబై, పుణె మరియు థానే నగరాల నుంచే ఉన్నాయి. ఒక్క ముంబై నగరం నుంచే 4,500 పైగా పాజిటివ్ కేసులు 200కు పైగా మరణాలు నమోదయ్యాయి.
రాష్ట్రాల వారీగా నమోదైన కోవిడ్-19 కేసుల వివరాలు ఇలా ఉన్నాయి
S. No. | Name of State / UT | Total Confirmed cases (Including 111 foreign Nationals) | Cured/Discharged/Migrated | Death |
---|---|---|---|---|
1 | Andaman and Nicobar Islands | 33 | 11 | 0 |
2 | Andhra Pradesh | 1097 | 231 | 31 |
3 | Arunachal Pradesh | 1 | 1 | 0 |
4 | Assam | 36 | 19 | 1 |
5 | Bihar | 251 | 46 | 2 |
6 | Chandigarh | 30 | 17 | 0 |
7 | Chhattisgarh | 37 | 32 | 0 |
8 | Delhi | 2625 | 869 | 54 |
9 | Goa | 7 | 7 | 0 |
10 | Gujarat | 3071 | 282 | 133 |
11 | Haryana | 289 | 176 | 3 |
12 | Himachal Pradesh | 40 | 22 | 1 |
13 | Jammu and Kashmir | 494 | 112 | 6 |
14 | Jharkhand | 67 | 13 | 3 |
15 | Karnataka | 501 | 177 | 18 |
16 | Kerala | 458 | 338 | 4 |
17 | Ladakh | 20 | 14 | 0 |
18 | Madhya Pradesh | 2096 | 210 | 99 |
19 | Maharashtra | 7628 | 1076 | 323 |
20 | Manipur | 2 | 2 | 0 |
21 | Meghalaya | 12 | 0 | 1 |
22 | Mizoram | 1 | 0 | 0 |
23 | Odisha | 103 | 34 | 1 |
24 | Puducherry | 7 | 3 | 0 |
25 | Punjab | 298 | 67 | 17 |
26 | Rajasthan | 2083 | 493 | 33 |
27 | Tamil Nadu | 1821 | 960 | 23 |
28 | Telengana | 991 | 280 | 26 |
29 | Tripura | 2 | 2 | 0 |
30 | Uttarakhand | 50 | 26 | 0 |
31 | Uttar Pradesh | 1843 | 289 | 29 |
32 | West Bengal | 611 | 105 | 18 |
Total number of confirmed cases in India | 26917 | 5914 | 826 |
నివేదికల ప్రకారం, భారతదేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో సుమారు 68 శాతం కేసులు కేవలం 27 జిల్లాల నుండే నమోదయ్యాయని తెలిసింది. కాగా, COVID-19 రోగుల అత్యధిక రికవరీ రేటు కేరళలో ఉంది, ఈ రాష్ట్రంలో రికవరీ రేటు దేశంలోనే అత్యధికంగా 74% గా నమోదైంది.
వైరస్ వ్యాప్తి కట్టడి కోసం భారతదేశంలో మే 3 వరకు లాక్డౌన్ అమలులో ఉంది. రాష్ట్రాల్లో లాక్డౌన్ పరిస్థితులు, వైరస్ నివారణ చర్యలే ప్రధానాంశంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (ఏప్రిల్ 27) ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)