Impending Threat at LoC: సరిహద్దు వద్ద పొంచి ఉన్న ముప్పు, ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు, అదను కోసం దాయాది ఎదురు చూస్తుందంటూ హెచ్చరించిన భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

ఇటీవల జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి సమాధానం ఇస్తూ ఆగష్టు- అక్టోబర్ నెలల మధ్య మొత్తం....

File image od army chief Bipin Rawat | Photo Credits: PTI

New Delhi, December 18: భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat)  సరిహద్దు వద్ద ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్‌తో ఏ క్షణంలోనైనా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని జనరల్ రావత్ హెచ్చరించారు. ఒకవైపు దేశంలో వివిధ కారణాలతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ, మరోసారి జమ్మూకాశ్మీర్ (Jammu-Kashmir) అంశంలో అదనుకోసం పొరుగున ఉన్న దాయాది దేశం ఎదురుచూస్తుందంటూ ఆర్మీ చీఫ్ తాజాగా చేసిన హెచ్చరికలు చర్చనీయాంశమవుతున్నాయి.

పాకిస్తాన్ (Pakistan) యొక్క శత్రు ప్రవర్తన కారణంగా నియంత్రణ రేఖ (LoC) వెంబడి పరిస్థితి ఉద్రిక్త వాతావరణం ఉంది. ప్రతీకారేచ్ఛతో రగులుతున్న పాకిస్థాన్‌కు దీటైన జవాబు ఇచ్చేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని రావత్ అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేసిన దగ్గర్నించీ పాకిస్తాన్ నిరంతరాయంగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతుందని రావత్ చెబుతూ, సరిహద్దు వద్ద తాజా పరిస్థితిపై ఆయన తర్వాత భారత ఆర్మీ చీఫ్ పగ్గాలు చేపట్టబోయే లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ నరవానేను అప్రమత్తం చేస్తున్నారు.

మొన్న సోమవారం కూడా పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత ఆర్మీ అధికారులు వేర్వేరు సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయారని, మరో జవానుకు తీవ్రగాయాలయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇటీవల జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి సమాధానం ఇస్తూ ఆగష్టు- అక్టోబర్ నెలల మధ్య మొత్తం 950 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘన సంఘటనలు నమోదైనట్లు వెల్లడించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

HC on Vijay Mallya’s Plea: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కీలక మలుపు, బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు, చేసిన అప్పు కంటే ఎక్కువ మొత్తం రికవరీ చేశారని మాల్యా పిటిషన్

Andhra Pradesh: ఏలూరులో దారుణం, ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా రేడియేషన్ తట్టుకోలేక మహిళ మృతి, సుష్మితా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆందోళన

PM Modi Speech in Lok Sabha: పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ

US Begins Deportation of Indian Migrants: అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు కొరడా, భారతీయులను వెనక్కి పంపుతున్న అగ్రరాజ్యం, దాదాపు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లుగా వార్తలు

Share Now