Maharashtra Shocker: స్కూల్లో బిస్కెట్లు తిన్న 150 మంది విద్యార్థులకు వాంతులు, మహారాష్ట్రలో విషాదకర ఘటన
మహారాష్ట్రలో (Maharashtra school)ని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఓ పాఠశాలలో పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా అందించిన బిస్కెట్లు (biscuits) తిని సుమారు 150 మందికిపైగా విద్యార్థులు (Students) ఆసుపత్రిపాలయ్యారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో (Maharashtra school)ని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఓ పాఠశాలలో పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా అందించిన బిస్కెట్లు (biscuits) తిని సుమారు 150 మందికిపైగా విద్యార్థులు (Students) ఆసుపత్రిపాలయ్యారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు.కేకేట్ జల్గావ్ గ్రామంలోని పాఠశాలలో శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా పిల్లలకు బిస్కెట్లు అందించారు.
అవి తిన్న కొద్దిసేపటికే పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వికారం, వాంతులతో ఇబ్బంది పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, గ్రామ పెద్దలు వెంటనే పిల్లల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఫుడ్ పాయిజనింగ్కు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement