Delhi Waqf Board Properties: ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు మోదీ సర్కారు షాక్, మసీదులు, దర్గాలు, సమాధులు ఉన్న 123 ఆస్తులను వెనక్కు ఇచ్చేయాలంటూ లేఖ, తీవ్రంగా స్పందించిన వక్ఫ్ బోర్డు
ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు చెందిన 123 ఆస్తులను (Waqf properties) స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల 8న వక్ఫ్ బోర్డుకు లేఖ రాసింది. ఈ ఆస్తుల పరిధిలో మసీదులు, దర్గాలు, సమాధులు కూడా ఉండటం గమనార్హం. వీటిని 2014 ఎన్నికలకు ముందు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు ఇచ్చింది
New Delhi, FEB 18: ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు చెందిన 123 ఆస్తులను (Waqf properties) స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల 8న వక్ఫ్ బోర్డుకు లేఖ రాసింది. ఈ ఆస్తుల పరిధిలో మసీదులు, దర్గాలు, సమాధులు కూడా ఉండటం గమనార్హం. వీటిని 2014 ఎన్నికలకు ముందు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు ఇచ్చింది. వాటన్నింటిని ఇప్పుడు మోదీ నేతృత్వంలోని మోదీ సర్కారు వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. కేంద్ర నిర్ణయంపై బోర్డు చైర్మన్, ఆప్ ఎమ్మెల్యే అమానాతుల్లా ఖాన్ (Amanatullah Khan) తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తుల్ని స్వాధీనపరచడం జరగదని, అడ్డుకుని తీరతామని ఆయన తేల్చిచెప్పారు.
కేంద్రం నిర్ణయానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదని ట్వీట్ చేశారు. అయితే డిప్యూటీ ల్యాండ్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఫిబ్రవరి 8న ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు లేఖ రాశారు. ఇందులో 122 ఆస్తులకు సంబంధించిన అన్ని విషయాలను విముక్తి చేయాలని స్పష్టం చేవారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)