Telangana Assembly Elections 2023: తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రి, బీజేపీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, ప్రధాని స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ఇప్పటికే ప్రకటించడం నేపథ్యంలో.. మరో అడుగు ముందుకేసి ప్రధాని నరేంద్ర మోదీ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు.
Hyd, Nov 7: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ఇప్పటికే ప్రకటించడం నేపథ్యంలో.. మరో అడుగు ముందుకేసి ప్రధాని నరేంద్ర మోదీ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీసీల ఆత్మగౌరవ సభలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఎల్బీ స్టేడియంతో తనకు అనుబంధం ఉందని, పదేళ్ల క్రితం ఈ స్టేడియంలో ప్రజలు ఆశీర్వదించడంతో తాను ప్రధానిని అయ్యానని వ్యాఖ్యానించారు. ఇదే మైదానం సాక్షిగా ఇప్పుడు తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారన్నారు. నాటి నా సభలో ప్రసంగం కోసం టిక్కెట్ పెట్టారని, దేశంలోనే ఇదో కొత్త ప్రయోగం అన్నారు.
తొమ్మిదేళ్లుగా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, కానీ అది నెరవేరలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇలాంటి వారిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారన్నారు. అదే సమయంలో అబ్దుల్ కలాంను, ద్రౌపది ముర్ములను రాష్ట్రపతిని చేసింది తామే అన్నారు. లోక్ సభలో తొలి దళిత స్పీకర్ బాలయోగిని చేసింది కూడా బీజేపీయే అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏలో మూడు అంశాలు కామన్గా ఉన్నాయన్నారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు ఆ రెండు పార్టీల లక్షణాలు అని విమర్శించారు. కాంగ్రెస్... బీఆర్ఎస్ సీ టీమ్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వేర్వేరు కాదని గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చింది బీజేపీయే అన్నారు. బీసీల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పారు. బీసీలకు ఏడాదికి రూ.1000 కోట్ల ఫండ్స్ ఇస్తామని బీఆర్ఎస్ చెప్పింది కానీ చేయలేదన్నారు. కేంద్ర కేబినెట్లో అత్యధిక బీసీలు కేంద్రమంత్రులుగా ఉన్నారన్నారు. ఎబీసీలకు ఎక్కువ మంది ఎంపీలకు బీజేపీ అవకాశమిచ్చిందన్నారు. తెలంగాణలో ఈసారి బీజేపీని గెలిపించి బీసీని సీఎంగా చేసుకోవాలన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లోనే బీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.
బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందన్నారు. ఆ పార్టీ నేతలకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుతో సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో అవినీతిని అంతం చేస్తాం... ఇది మోదీ ఇచ్చే గ్యారెంటీ అన్నారు. లిక్కర్ స్కాం కేసును దర్యాఫ్తు చేస్తుంటే ఇక్కడి నేతలు సీబీఐ, ఈడీని తిడుతున్నారన్నారు. అవినీతి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారి నుంచి తిరిగి రాబడతామన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీ బీఆర్ఎస్ వైఫల్యం అన్నారు. అన్ని నియామక పరీక్షలలో అవకతవకలు ఇక్కడ కామన్ అయ్యాయన్నారు. తెలంగాణకు మోసం చేసిన బీఆర్ఎస్ను సాగనంపాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఒక తరం భవిష్యత్తును నాశనం చేసిందన్నారు. తెలంగాణ యువతను మోసం చేసిన బీఆర్ఎస్ను సాగనంపాలా? లేదా? అన్నారు. తాను ఢంకా బజాయించి చెబుతున్నానని బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు.
బీసీ యువతకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదన్నారు. బీసీలకు రూ.1 లక్ష ఇస్తామని మోసం చేసిందన్నారు. తాము మాత్రం మెడికల్, డెంటల్ సీట్లలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. టీచర్ పోస్టులు వేలల్లో ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఇచ్చే రేషన్ను మరో అయిదేళ్లు పొడిగించినట్లు చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభలో సమ్మక్క సారలమ్మ... యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని తలుచుకున్నారు. ప్రసంగం సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే పదాల్ని తెలుగులో పలికారు. నా కుటుంబ సభ్యులారా.. అంటూ పలుమార్లు పలికి అందరినీ అలరించారు. పుణ్యభూమి తెలంగాణకు ప్రమాణాలు అని వ్యాఖ్యానించారు.
బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ ప్రసంగం హైలెట్స్
►పీఎం ఆవాజ్ యోజన్ కింద తెలంగాణలో 2.5 లక్షల ఇళ్లు ఇచ్చాం
► కోవిడ్ కష్టకాలంలో ప్రతీ పేదకుటుంబాన్ని ఆదుకున్నాం.
►పేదలకు ఇచ్చిన ఉచిత రేషన్ను మరో 5 ఏళ్లు పెంచుతున్నాం
►బీసీ కమిషన్కు మా ప్రభుత్వం రాజ్యాంగ మోదా కల్పించింది.
►తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.
►బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్తో సంబంధాలు ఉన్నాయి.
►లిక్కర్ స్కామ్పై దర్యాప్తు చేస్తుంటే.. ఈడీ, సీబీఐని ఇక్కడి నేతలు తిడుతున్నారు.
►అవినీతిని అంతం చేస్తాం.. ఇది మోదీ గ్యారంటీ.
►అవినీతి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
►ఎవరు ప్రజాధనాన్ని దోచుకున్నారో.. వాటిని తిరిగి రాబడతాం.
►2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్పారు.
►బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోంది.
►బీఆర్ఎస్ వైఫల్యం వల్ల టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది.
►అన్నీ నియామకాల పరీక్షల్లో అవకతకవకలు కామన్ అయిపోయాయి.
►ఒక తరం భవిష్యత్తును బీఆర్ఎస్ నాశనం చేసింది.
► తెలంగాణలో వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
►అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది బీజేపీనే
►బీజేపీకి పూర్తి మెజార్టీ ఇచ్చి ఓబీసీ వర్గానికి చెందిన నన్ను ప్రధానిని చేశారు.
►కేంద్ర కేబినెట్లో అత్యధిక మంది బీసీలు మంత్రులుగా ఉన్నారు.
►లోక్సభ తొలి దళిత స్పీకర్గా బాలయోగిని చేసింది బీజేపీనే.
►ఇదే మైదదానం సాక్షిగా బీసీ ముఖ్యబమంత్రి రాబోతున్నారు
►తెలంగాణలో మార్పు తుఫాన్ కనిపిస్తోంది
►తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీనే ముఖ్యమంత్రి చేస్తాం
►యువతను మోసం చేసిన బీఆర్ఎస్ను సాగనంపాలా.. వద్దా?
►సమ్మక్మ- సారలమ్మకు జై అంటూ ప్రసంగం మొదలు పెట్టిన మోదీ
►బీసీ ఆత్మగౌరవ సభలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా
►ఎల్బీ స్టేడియంతో నాకు సంబంధం ఉంది
►నాటి సభలో నా ప్రసంగం కోసం టికెట్ పెట్టారు
►భారతదేశంలో అది ఒక కొత్త ప్రయోగం
►ఇదే గ్రౌండ్లో ప్రజలు ఆశీర్వదించడంతో నేను ప్రధాని అయ్యాను.
►ఇదే మైదానం సాక్షిగా బీజేపీ బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారు
►తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు.
►నీళ్లు నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమించింది.
►తెలంగాణ ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్షలను అణగదొక్కారు.
►9 ఏళ్లుగా తెలంగాణలో బీసీ, స్సీ, ఎస్టీ వ్యతిరేక ప్రభుత్వం ఉంది.
►బీసీ ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు.
►కాంగ్రెస్.. బీఆర్ఎస్కు సీ టీమ్గా పనిచేస్తుంది.
►బీఆర్ఎస్ కేవలం తన కుటుంబ సభ్యుల కోసమే పనిచేసింది.
►కాంగ్రెస్, బీఆర్ఎస్లలో కుటుంబ పాలన, అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలే
►కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఎప్పుడూ బీసీలకు పదవులు ఇవ్వలేదు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)