Ration Card New Rules: కేంద్రం షాకింగ్ నిర్ణయం, ఇక నుంచి వాళ్లకి రేషన్ కార్డు కట్, కొత్త రూల్స్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, రూల్స్ ఏంటో తెలుసుకోండి

ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ సౌకర్యం అందించబడుతోంది. ఈ పథకాన్ని వచ్చే 6 నెలల పాటు కేంద్రం పొడిగించింది. ఈ ఉచిత రేషన్ పథకంలో, చాలా మంది అనర్హులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది.

Rationcards (Photo Credits: IANS| Representational Image)

New Delhi, Sep 29: ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ సౌకర్యం అందించబడుతోంది. ఈ పథకాన్ని వచ్చే 6 నెలల పాటు కేంద్రం పొడిగించింది. ఈ ఉచిత రేషన్ పథకంలో, చాలా మంది అనర్హులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. ఇందులో భాగంగా రేషన్ కార్డును రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను రూపొందించింది.

మీరు కూడా ఉచిత రేషన్ ప్రయోజనాన్ని పొందుతున్నట్లయితే, వెంటనే ఈ రూల్స్ తెలుసుకోండి ఎందుకంటే కార్డు రద్దు చేసిన తర్వాత, మీరు ఈ సదుపాయాన్ని పొందలేరు. దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది.రేషన్ కార్డు రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. మీరు ఈ నిబంధనల ప్రకారం సరిపోకపోతే, మీ రేషన్ కార్డు కూడా రద్దు చేయబడుతుంది. ఈ కారణంగా, ఈ సమయంలో, అటువంటి వారికి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది, అనర్హులు ఎవరైనా, వారి రేషన్ కార్డును వారి స్వంతంగా రద్దు చేయాలని కోరుతోంది.

కేంద్ర ప్రభుత్వం పండుగ శుభవార్త, ఉచిత రేష‌న్ మరో 3 నెలలు పొడిగింపు, పీఎం గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న ప‌థకాన్ని 3 నెలలు పొడిగించినట్లు తెలిపిన అనురాగ్ ఠాకూర్

నియమాలు ఏమిటో తెలుసా?

మీ స్వంత ఆదాయంతో సంపాదించిన 100 చదరపు మీటర్ల ప్లాట్/ఫ్లాట్ లేదా ఇల్లు, ఫోర్ వీలర్ వెహికిల్/ట్రాక్టర్, ఆయుధాల లైసెన్స్, కుటుంబ ఆదాయం గ్రామంలో రెండు లక్షల కంటే ఎక్కువ మరియు నగరంలో సంవత్సరానికి మూడు లక్షలు ఉంటే, అలాంటి వారు వారి రేషన్ కార్డును సంబంధిత కార్యాలయంలో సరెండర్ చేయాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్‌కార్డుదారుడు కార్డును సరెండర్ చేయకపోతే విచారణ అనంతరం అలాంటి వారి కార్డును రద్దు చేస్తారు. దీంతో పాటు ఆ కుటుంబంపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. అంతేకాదు అలాంటి వారి నుంచి రేషన్ తీసుకుంటున్నాడు కాబట్టి రేషన్ కూడా రికవరీ అవుతుంది.

మీడియా నివేదికల ప్రకారం, ప్రభుత్వం ప్రస్తుతం పేదలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. తాజాగా రాబోయే 3 నుండి 6 నెలల వరకు ప్రభుత్వం దానిని పొడిగించింది. దీనివల్ల ప్రభుత్వానికి 10 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement