Dasha Papahara Dashami: జూన్ 10న దశపాప హర దశమి, ఈ రోజున ఈ వ్రతం చేస్తే, జీవితంలో తెలిసీ, తెలియక చేసిన అన్ని పాపాలను తొలగించుకునే సువర్ణ అవకాశం...
పురాణాల కథనం ప్రకారం ఈ గంగను భగీరధుడు భూమికి తీసుకొచ్చిన రోజు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష దశమిని తెలుస్తోంది. గంగావతరణం జరిగింది జ్యేష్ఠ శుద్ధ దశమి రోజే. ఈరోజును దశపాపహర దశమిగా పేర్కొంటారు. ఈ రోజుకి పది రకాలైన పాపాలను తొలగించే శక్తి ఉందని హిందువుల నమ్మకం.
Dasha Papahara Dashami: పురాణాల కథనం ప్రకారం ఈ గంగను భగీరధుడు భూమికి తీసుకొచ్చిన రోజు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష దశమిని తెలుస్తోంది. గంగావతరణం జరిగింది జ్యేష్ఠ శుద్ధ దశమి రోజే. ఈరోజును దశపాపహర దశమిగా పేర్కొంటారు. ఈ రోజుకి పది రకాలైన పాపాలను తొలగించే శక్తి ఉందని హిందువుల నమ్మకం. తెలిసీ, తెలియక పాపాలు చేయడం మానవ సహజం. అయితే మనం చేసింది పాపమని, దాని ద్వారా అశుభ ఫలితాలు పొందే ప్రమాదమున్నదని గ్రహించి తొలగించుకోవటం గొప్ప ప్రయత్నం. అటువంటి అవకాశాన్ని కలిగించేదే దశపాపహర దశమి వ్రతం.
పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం – ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు. అర్హత లేనివానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు.
Astrology: ఈ మూడు రాశులకు వినాయకుడి కృపతో అదృష్టం వరిస్తుంది, మీ రాశి కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి..
ఈ పది పాపాలను సామాన్య మానవుడు నిత్య జీవితంలో చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అందుకనే ఆ పది పాపాలను తొలగించుకోవాటానికి దశపాపహరదశమి వ్రతం ఆచరించాలని వ్రతనిర్ణయకల్పవల్లి అనే గ్రంథం స్పష్టం చేస్తుంది. నదీ స్నానం అనేది ఈ వ్రతంలో ప్రధాన ఘట్టం.
జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలముంటుంది. ముఖ్యంగా గంగా నదిలో స్నానం చేస్తే గొప్ప విశేషం. కాశీ లోని దశాశ్వమేధ ఘాట్ దీనికి ప్రసిద్ధి. ఈ రోజు గంగా స్నానం పాపాలను తొలగిస్తుంది. గంగకు దగ్గరగా లేని వారు, సమీపంలోని నది, చెఱువు లేదా బావి దగ్గరకు వెళ్లి వ్రతమాచరించాలి.
దశ పాపహరదశమి వ్రత విధానం స్కంద పురాణంలో వివరించబడింది. ప్రతిమ నందు గానీ, కలశమందు గానీ గంగా దేవిని ఆవాహన చేసి పూజించాలి. తెల్లని వస్త్రాలు ఆ తల్లికి సమర్పించి గంగాస్తోత్రం పఠించాలి. ఆ తర్వాత విష్ణు మూర్తిని గానీ, శివుడిని గానీ పూజించాలి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)