Shab-e-Meraj History: రోజుకు 5 సార్లు నమాజ్ చెయ్యాలని అల్లాహ్ ఆదేశించిన రోజు, లైలతుల్-మేరాజ్ లేదా షబ్-ఎ-మేరాజ్ ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు
ఇస్లామీయ సాంప్రదాయాలలో ఇస్రా, మేరాజ్ అనునవి సా.శ. 621 (1 హిజ్రీ పూర్వం) మహమ్మదు ప్రవక్త గారి షబ్-ఎ-మేరాజ్ న ఆరోహణాకార్యక్రమాల రెండు భాగాలు. మహమ్మదు ప్రవక్త భౌతికంగా మేరాజ్ ప్రయాణం చేశారని చాలామంది ముస్లిం పండితుల అభిప్రాయం.
ఇస్లామీయ సాంప్రదాయాలలో ఇస్రా, మేరాజ్ అనునవి సా.శ. 621 (1 హిజ్రీ పూర్వం) మహమ్మదు ప్రవక్త గారి షబ్-ఎ-మేరాజ్ న ఆరోహణాకార్యక్రమాల రెండు భాగాలు. మహమ్మదు ప్రవక్త భౌతికంగా మేరాజ్ ప్రయాణం చేశారని చాలామంది ముస్లిం పండితుల అభిప్రాయం. కొందరైతే ఆత్మపరంగా మేరాజ్ ప్రయాణం చేశారని భావిస్తారు. క్లుప్తంగా ఈ ప్రయాణ సారాంశాన్ని ఖురాన్ లోని అల్-ఇస్రా సూరాలో 1 నుండి 60 సూక్తులలో వర్ణింపబడింది. ఇతరత్రా విషయాలు హదీసులలో నుండి లభించాయి.ఈ సారి భారత్ లో ఫిబ్రవరి 19న షబ్-ఎ-మేరాజ్ ముబారక్ జరుపుకుంటున్నారు.
ఇస్రా: మక్కా నగరంలోని కాబాలో మహమ్మదు ప్రవక్త విశ్రాంతి తీసుకొనుచుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై, అల్లాహ్ ఆజ్ఞతో బుర్రాఖ్ పై కూర్చుబెట్టుకొని, మక్కానుండి "సుదూరపు మస్జిద్" (జెరూసలేం లోని మస్జిద్-అల్-అఖ్సా) కు తీసుకెళ్ళాడు. ఈ ప్రయాణాన్ని ఇస్రా అంటారు. ఇచ్చట ప్రవక్తల నమాజుకు ఇమామత్ చేశారు. మేరాజ్ జరిగిన సమయంలో, ఆ ప్రాంతంలో మస్జిద్ లేదు. అందుకే ఆ మస్జిద్ కు 'సుదూరపు మస్జిద్' లేక మస్జిద్-ఎ-అఖ్సా అని పేరు పెట్టారు. ఈ మస్జిద్ జెరూసలేం లోని మస్జిద్ ల సమూహంలో గలదు
మహాశివరాత్రి రోజు శివలింగంపై ఈ 9 వస్తువులను వేసి పూజిస్తే, కోటీశ్వరులు అవడం ఖాయం..
మేరాజ్: "సుదూరపు మస్జిద్" నుండి జిబ్రయీల్, మహమ్మదు ప్రవక్తను బుర్రాఖ్ పై కూర్చోబెట్టి, మేరాజ్ స్వర్గారోహణకై తీసుకెళ్ళాడు. ఈ ప్రయాణాన్ని మేరాజ్ అంటారు.ఈ ఆరోహణలో మహమ్మదు ప్రవక్త ఇతర ప్రవక్తలతో సంభాషిస్తాడు. అల్లాహ్ తోనూ సంభాషిస్తాడు. ఈ శుభఘడియలో అల్లాహ్ తన బహుమానంగా మహమ్మదు ప్రవక్తకు 5 పూటల ప్రార్థనలను (నమాజ్ లను) ప్రసాదిస్తాడు.
ఈ మహమ్మదు ప్రవక్త 'ఇస్రా, మేరాజ్' ఆరోహణనూ (The Night of Ascent), ప్రయాణాన్ని విశ్వాసులు నమ్ముతారు (అందులో అబూబక్ర్ ప్రథముడు), అవిశ్వాసులు నమ్మక గేలిచేస్తారు.మహమ్మదు ప్రవక్త 'ఇస్రా మేరాజ్' లను పునస్కరించుకొని ముస్లింలు షబ్-ఎ-మేరాజ్ లేదా లైలతుల్ మేరాజ్ పర్వాన్ని గడుపుకొంటారు. రాత్రంతా జాగారం చేసి నమాజ్ చేస్తారు.ఇస్లాంలో పర్వదినమైన లైలతుల్-మేరాజ్, హిజ్రత్కు ముందు తాయిఫ్ ప్రజలవద్దకు వెళ్ళకముందు జరిగింది. రజబ్ నెల 27వ తేదీన రాత్రి జరిగింది.
లైలతుల్-మేరాజ్ లేదా షబ్-ఎ-మేరాజ్ (Shab-e-Miraj) ప్రపంచంలోని అన్ని దేశాలలోని ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పర్వాన మస్జిద్ లకు దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం జేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇస్రా, మేరాజ్ ల కథ వివరింపబడుతుంది. మహమ్మదు ప్రవక్త ఏ విధంగా అల్లాహ్ను కలవడానికి జిబ్రయీల్తో బుర్రాఖ్ పై ప్రయాణ మయ్యారు, వారి ప్రయాణం యేవిధంగా జరిగింది, అల్లాహ్, మహమ్మద్ ల మధ్య సంభాషణ, వాటి విషయాలు యేవి ఇవన్నియూ ప్రసంగరూపంలో సాగుతాయి. ఈ రాత్రిప్రయాణం జరిగి అల్లాహ్ తో సంభాషించిన తరువాత అల్లాహ్, మహమ్మదు ప్రవక్త ఆయన అనుచరులంతా రోజుకు అయిదు సార్లు నమాజ్ చెయ్యాలని ఆదేశిస్తాడు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో ముస్లీం పెద్దలు రాసిన సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఏదైనా పొరపాటు ఉంటే లేటెస్ట్లీ దానికి ఎలాంటి బాధ్యత వహించదు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)