Bullet in Plane: మేఘాల్లో.. 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం మీదకు సర్రున దూసుకొచ్చిన బుల్లెట్.. సరాసరి ఓ ప్రయాణికుడి చెంపలోకి.... తర్వాత ఏమైంది??

మయన్మార్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. గాల్లో 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలోకి తూటా దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు.

Plane Accident (Photo Credits: Twitter)

NewDelhi, October 3: మయన్మార్ లో (Myanmar) దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. గాల్లో 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలోకి (Plane) తూటా (Bullet) దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు.  మయన్మార్ నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం నెపిడో నగరం నుంచి లోయికా సిటీకి బయల్దేరింది. ల్యాండింగ్ కు (Landing) సిద్ధమవుతుండగా, విమానం గోడలను చీల్చుకుంటూ  ఓ తూటా దూసుకొచ్చింది. విండో పక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడి చెంపకు గాయం చేసింది. దాంతో విమానంలో ఉన్నవారు హడలిపోయారు. ఆ సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన ప్రయాణికుడిని విమానం ల్యాండ్ అయిన తర్వాత హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.

సమస్యలను పట్టించుకోవడం లేదని మనస్తాపం.. గొంతు కోసుకున్న వీఆర్ఏ.. నెక్కొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం వద్ద ఘటన.. వేతన సవరణ, పదోన్నతులు సహా పలు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు 69 రోజులుగా దీక్ష

తూటా ఘటనపై మయన్మార్ సైనిక ప్రభుత్వం స్పందించింది. లోయికా సిటీకి విమానాలను రద్దు చేసింది. విమానాశ్రయం వద్ద భారీగా సైనికులను రంగంలోకి దించింది. ఇది తమ ప్రత్యర్థి పక్షం కరెన్ నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీ (కేఎన్ పీపీ) పనే అని మయన్మార్ సైనిక ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కేఎన్ పీపీ ఖండించింది. జరిగిన ఘటనలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

India’s First Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు పట్టాలెక్కేది అప్పుడే, కీలక విషయాలను వెల్లడించిన కేంద్ర, రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

Bullets In Baby Diaper: బేబీ డైపర్‌లో 17 బుల్లెట్‌లు దాచి అక్రమ రవాణా, న్యూయార్క్ విమానాశ్రయంలో పట్టుబడ్డ నిందితుడు

Bullet Train Stattion Video: దేశంలో తొలి బుల్లెట్‌ రైలు స్టేషన్‌ వీడియో ఇదిగో, అండర్‌గ్రౌండ్‌ స్టేషన్‌, ఎత్తైన కారిడార్‌పై ప్రయాణం, 26 కిలోమీటర్ల మేర సొరంగాలు

Bullet Train Project Update: వచ్చే మూడేళ్లలో రైలు పట్టాలపై బుల్లెట్ ట్రైన్ పరుగులు పెడుతుంది, ఈ నెలాఖరుకి అయోధ్యలొ విమానాశ్రయం పూర్తి, వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

Advertisement
Advertisement
Share Now
Advertisement