India vs China: చైనాకు దిమ్మతిరిగే షాకివ్వబోతున్న భారత్, ఈ ఏడాది టూ వీలర్ మార్కెట్‌లో చైనాను వెనక్కి నెట్టేయనున్న ఇండియా, ప్రపంచంలోనే అతిపెద్ద 2-వీలర్ మార్కెట్‌గా..

ద్విచక్ర వాహన మార్కెట్‌లో భారత్ దూసుకుపోతోంది. కొత్త నివేదిక ప్రకారం, 2024లో చైనాను (India vs China)అధిగమించడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా అవతరించబోతోంది. భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఈ వృద్ధి కనిపిస్తోంది.

China vs India

2-Wheeler Market In India: ద్విచక్ర వాహన మార్కెట్‌లో భారత్ దూసుకుపోతోంది. కొత్త నివేదిక ప్రకారం, 2024లో చైనాను (India vs China)అధిగమించడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా అవతరించబోతోంది. భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఈ వృద్ధి కనిపిస్తోంది.

బలమైన ఆర్థిక వృద్ధి రేటు, తక్కువ దూరాలకు ద్విచక్ర వాహన వినియోగదారుల మొదటి ఎంపిక మరియు షేర్డ్ మొబిలిటీ స్పేస్‌లో ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, 2024లో భారతదేశం చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా అవతరించనుందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది.2023లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన ఒక శాతం కంటే తక్కువ పెరిగాయి. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు మాత్రం భారీగా పెరిగాయి. 2024లో విక్రయించే ద్విచక్ర వాహనాల్లో 25 శాతానికి పైగా ఎలక్ట్రిక్‌గా ఉంటాయని అంచనా. రిమోట్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కోసం 16.80 లక్షల టెస్లా కార్లు రీకాల్‌, ఉచితంగా మరమ్మతులు చేస్తామని ప్రకటన

ద్విచక్ర వాహన మార్కెట్ పరిపక్వత దిశగా పయనిస్తోందని, అయితే ముఖ్యంగా 2025 తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల మొగ్గు పెరుగుతుందని సీనియర్ విశ్లేషకుడు సౌమెన్ మండల్ అన్నారు. రాబోయే కాలంలో ఆగ్నేయాసియా దేశాలు మరియు భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం వేగంగా పెరుగుతుంది.టాప్ 10 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో మూడు (ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్స్ మరియు ఏథర్ ఎనర్జీ) భారత్‌కు చెందినవని, భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. ఓలా మరియు ఏథర్‌లు TVS, బజాజ్ మరియు హీరోలతో పోటీ పడుతున్న గ్రీన్‌ఫీల్డ్ 'EV-ఫస్ట్' ద్విచక్ర వాహనాల కంపెనీలు.

టూవీలర్ ప్రీమియం విభాగంలో హార్లీ డేవిడ్‌సన్, ఎన్‌ఫీల్డ్, యమహా తదితర కంపెనీలకు పోటీగా అల్ట్రావయోలెట్, రివోల్ట్ మోటార్స్, ఎనర్జికా మోటార్, డామెన్, ఏఆర్‌సీ వంటి కంపెనీలు మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నాయని నివేదిక పేర్కొంది.2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాటా 44 శాతంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. దీంతో 2030 నాటికి ద్విచక్ర వాహనాల్లో సెమీకండక్టర్ల వినియోగం 15 శాతానికి పెరగనుంది. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పార్ట్‌నర్‌ నీల్‌ షా మాట్లాడుతూ.. ఫోర్‌-వీలర్‌ మార్కెట్‌ మాదిరిగానే ద్విచక్ర వాహనాల మార్కెట్‌లోనూ రానున్న కాలంలో మార్పులు రానున్నాయి. ఇందులో విద్యుదీకరణ కీలక పాత్ర పోషిస్తుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement