Power Trip: మహా మంత్రికి మహా షాక్.. మంత్రికి ఆపరేషన్ చేస్తుండగా పోయిన కరెంట్.. సెల్‌ఫోన్ టార్చ్ లైట్ లో ఆపరేషన్ పూర్తి చేసిన వైద్యులు.. అనంతరం జనరేటర్ కోసం నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి

మహారాష్ట్రలో కేబినెట్ మంత్రి సందీపన్ భుమ్రే దంతాలకు శస్త్రచికిత్స చేస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సెల్‌ఫోన్‌లోని టార్చ్‌ సాయంతో వైద్యులు ఆపరేషన్ పూర్తి చేశారు.

Minister (Photo Credits: Twitter)

Mumbai, October 18: మహారాష్ట్రలో (Maharastra) ఓ మంత్రికి (Minister) శస్త్రచికిత్స చేస్తుండగా విద్యుత్ సరఫరా (Power Supply) నిలిచిపోయింది. దీంతో సెల్‌ఫోన్‌లోని (Mobile) టార్చ్‌ సాయంతో వైద్యులు ఆపరేషన్ పూర్తి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి సందీపన్ భుమ్రే (Sandipan Bhumre) ఇటీవల ఔరంగాబాద్‌లోని ఘటి డెంటల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన దంత పరీక్ష చేయించుకున్నారు. పరీక్షించిన వైద్యులు రూట్ కెనాల్ ఆపరేషన్ చేయించుకోవాలని మంత్రికి సూచించారు. ఆయన సరేననడంతో ఆపరేషన్ ప్రారంభించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో భారీగా వర్షాలు పడే అవకాశం.. ఉత్తర అండమాన్ సముద్రంలో నేడు సిత్రాంగ్ ఏర్పడుతుందన్న కెనడా శాస్త్రవేత్తలు.. కొట్టిపారేసిన ఐఎండీ.. అయితే, వర్షాలు మాత్రం కురుస్తాయని వెల్లడి

ఆపరేషన్ ప్రారంభమైన కాసేపటికే ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మరో మార్గంలేక సెల్‌ఫోన్‌లోని టార్చ్‌ సాయంతో ఆపరేషన్ పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అయ్యాయి. ఆసుపత్రికి జనరేటర్ సదుపాయం లేదని, గత కొంతకాలంగా అడుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని వైద్యులు ఈ సందర్భంగా మంత్రికి విన్నవించారు. స్పందించిన ఆయన వెంటనే నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Aurangabad Fire Accident: విషాదం! మ‌హారాష్ట్రలో ఘోర అగ్ని ప్ర‌మాదం, ఒకే కుటుంబానికి చెందిన 7 గురు మృతి, టైల‌రింగ్ షాపులో మంట‌ల చెల‌రేగి ఊపిరాడ‌క కుటుంబ‌మంతా మృతి

12 Jyotirlingas in India: శివుని పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాలు ఇవిగో, జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రదేశాలు ఇవి..

HC on Abortion: అత్యాచార బాధితురాలి గర్భాన్ని తొలగించేందుకు నిరాకరించిన బాంబే హైకోర్టు, బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జన్మనివ్వవచ్చని తీర్పు

CM KCR in Aurangabad: మ‌హారాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ వరాల జల్లులు, బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తే ఇంటింటికి తాగు నీరు, ప్ర‌తి ఎక‌రాకు సాగునీరు

Advertisement
Advertisement
Share Now
Advertisement