Kantara Screening At UNO: కాంతార సినిమాకు అరుదైన గౌరవం.. ఐరాస కార్యాలయంలో నేడు ప్రదర్శన..

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొంది రికార్డులు సృష్టించిన ‘కాంతార’ సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో నేడు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.

Credits: Twitter

Newdelhi, March 17: కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab shetty) స్వీయ దర్శకత్వంలో రూపొంది రికార్డులు సృష్టించిన ‘కాంతార’ (Kantara) సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి (United Nations) కార్యాలయంలో నేడు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో నటుడు, దర్శకుడు రిషభ్‌ శెట్టి ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకున్నారు. సినిమా స్క్రీనింగ్ ముగిసిన అనంతరం పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమాల పాత్రపై ఆయన ప్రసంగిస్తారు. భారతీయ సినిమాలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాయని, తన సినిమా ‘కాంతార’లోనూ ఆ అంశాన్ని ప్రస్తావించినట్టు రిషభ్‌ చెప్పారు. కాగా, ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శితమయ్యే తొలి చిత్రంగా ‘కాంతార’ రికార్డులకెక్కబోతోంది.

‘ఖలేజా’ నటుడు అమన్‌పై అమెరికాలో దాడి.. జిమ్‌లో అందరూ చూస్తుండగానే ఘటన.. శరీరంపై పలుచోట్ల కత్తి గాయాలు.. వీడియో వైరల్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement