Ram Temple Inauguration: వీడియో ఇదిగో, అయోధ్యకు చేరుకున్న చిరంజీవి, రాంచరణ్, బయలుదేరేముందు అభిమానులను కలిసిన తండ్రీకొడుకులు
అయోధ్యలో నేడు (జనవరి 22) రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లకు కూడా ఆహ్వానం అందిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో తెలుగు సూపర్ స్టార్లు చిరంజీవి, రామ్ చరణ్ అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు.
అయోధ్యలో నేడు (జనవరి 22) రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లకు కూడా ఆహ్వానం అందిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో తెలుగు సూపర్ స్టార్లు చిరంజీవి, రామ్ చరణ్ అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు.వారు హైదరాబాద్ నుంచి బయలు దేరేముందు అభిమానులను కలిశారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసి చిరంజీవి, రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు చిరంజీవి, రామ్ చరణ్ లకు శ్రీరామ ప్రతిమను బహూకరించారు. పలువురు అభిమానులు రక్తదానం కూడా చేశారు.
అంతకుముందు, చిరంజీవి తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇది ఆ దేవుడు పంపిన ఆహ్వానంగా భావిస్తానని తెలిపారు. "ఆ అంజనాదేవి పుత్రుడు 'చిరంజీవి' హనుమంతుడు... భువిపై ఉన్న ఈ అంజనాదేవి పుత్రుడు చిరంజీవికి పంపిన ఆహ్వానం" అంటూ అభివర్ణించారు.
Here's Video