Video: వీడియో ఇదిగో, మలేషియా ప్రధానితో భేటీ అయిన రజినీకాంత్, అందుకోసమే కలిసానని చెప్పుకొచ్చిన సౌత్ ఇండియా సూపర్ స్టార్

రజనీకాంత్‌ మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం (Anwar Ibrahim)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మలేషియా వెళ్లిన రజనీకాంత్ (Rajinikanth) అక్కడ ప్రధానిని కలిసి కాసేపు ముచ్చటించారు.

Rajinikanth meets Prime Minister of Malaysia

రజనీకాంత్‌ మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం (Anwar Ibrahim)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మలేషియా వెళ్లిన రజనీకాంత్ (Rajinikanth) అక్కడ ప్రధానిని కలిసి కాసేపు ముచ్చటించారు. తన ఎక్స్‌లో (ట్విటర్‌) ఈ ఫొటోలను షేర్‌ చేసిన అన్వర్‌ ఇబ్రహీం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్‌ను కలవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.

ప్రజల కష్టాలు, ఆ కష్టాల సమయంలో నేను అందించిన సేవల పట్ల ఆయన గౌరవం ప్రదర్శించారు. అలాగే భవిష్యత్తులో ఆయన తీయనున్న సినిమాల్లో సామాజిక అంశాలు ఎక్కువగా ఉండేలా చూడాలని నేను కోరాను’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక 2017లోనూ రజనీకాంత్‌ను అప్పటి మలేషియా ప్రధాని నజీబ్‌ రజాక్‌ కలిసిన విషయం తెలిసిందే. దీంతో మలేషియా పర్యాటక శాఖకు రజనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ కానున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిపై స్పందించిన రజనీ.. ‘కబాలి’ షూటింగ్‌ ఎక్కువ భాగం మలేషియాలో జరిగిందని.. ఆ సమయంలో ప్రధానిని కలవడం కుదరకపోవడంతో ఇప్పుడు ఆయన ఆహ్వానించినట్లు తెలిపారు.

Rajinikanth meets Prime Minister of Malaysia

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement