Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, 5 మంది నక్సల్స్‌ మృతి, ఇంకా కొనసాగుతున్న కాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 5 మంది మావోయిస్టులు మృతిచెందారు.

Encounter (Photo-ANI)

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 5 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని నారాయణపూర్‌ ఐజీ సంజయ్‌ రాజ్‌ చెప్పారు.ఐజీ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం అంబూజ్‌మడ్‌లోని కోహ్‌కామెటా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భద్రతాబలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా అవతలివైపు నుంచి కాల్పులు మొదలవడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement