Encounter In Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మళ్లీ భారీ ఎన్కౌంటర్... 12 మంది మావోయిస్టులు మృతి, బీజాపూర్లో కుంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుపడ్డ మావోయిస్టులు
ఛత్తీస్గఢ్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్లో ఇవాళ ఉదయం మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది(Encounter In Chhattisgarh).
ఛత్తీస్గఢ్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్లో ఇవాళ ఉదయం మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది(Encounter In Chhattisgarh). కుంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టులు ఎదురుపడగా జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు(12 Naxalites killed) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు(Bijapur encounter). అలాగే ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు వెల్లడించారు.
ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు గాయపడ్డారని సమాచారం. ఘటనా స్థలం నుంచి కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు పోలీసులు తెలపగా డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బృందాలు చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి.
రీసెంట్గా ఒడిశా-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్(encounter) జరుగగా 20 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో అగ్రనాయకులు కూడా ఉండటం విశేషం.
encounter in Chhattisgarh's Bijapur, 12 Maoists killed
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)