Corruption Case: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అరెస్ట్, మ‌నీలాండ‌రింగ్ కేసులో అనిల్ దేశ్‌ముఖ్‌‌ను అరెస్ట్ చేసిన సీబీఐ, ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ తిరస్కరించిన బాంబే హైకోర్టు

మ‌హారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను అవినీతి కేసులో సీబీఐ బుధ‌వారం అరెస్ట్ చేసింది. అంత‌కుముందు దేశ్‌ముఖ్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి కుంద‌న్ షిండే, కార్య‌ద‌ర్శి సంజీవ్ ప‌ల్నాడెను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ స‌చిన్ వ‌జేను డిస్మిస్ చేశారు. ఇక బాంబే హైకోర్టు అనిల్ దేశ్‌ముఖ్ పిటిష‌న్‌ను స్వీక‌రించేందుకు తిర‌స్క‌రించింది.

Former Maharashtra Home Minister Anil Deshmukh (Photo Credits: Twitter)

మ‌హారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను అవినీతి కేసులో సీబీఐ బుధ‌వారం అరెస్ట్ చేసింది. అంత‌కుముందు దేశ్‌ముఖ్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి కుంద‌న్ షిండే, కార్య‌ద‌ర్శి సంజీవ్ ప‌ల్నాడెను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ స‌చిన్ వ‌జేను డిస్మిస్ చేశారు. ఇక బాంబే హైకోర్టు అనిల్ దేశ్‌ముఖ్ పిటిష‌న్‌ను స్వీక‌రించేందుకు తిర‌స్క‌రించింది. అవినీతి కేసులో త‌న క‌స్ట‌డీని కోరుతూ సీబీఐ ద‌ర‌ఖాస్తును సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్ధానం అనుమ‌తించ‌డాన్ని దేశ్‌ముఖ్ స‌వాలు చేశారు. సీబీఐ కేసులో ఇద్ద‌రు నిందితుల ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ల‌ను కూడా బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అనిల్ దేశ్‌ముఖ్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే క‌స్ట‌డీని త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని సీబీఐ ఆరోపించింది.

కాగా ముంబై మాజీ పోలీస్ క‌మిష‌న‌ర్ ప‌రం వీర్ సింగ్ అప్ప‌టి హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. న‌గ‌రంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెల‌కు రూ 100 కోట్లు వ‌సూలు చేయాల‌ని పోలీస్ అధికారుల‌కు దేశ్‌ముఖ్ టార్గెట్ విధించార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ ఆరోప‌ణ‌ల నేప‌ధ్యంలో దేశ్‌ముఖ్‌పై కేసు న‌మోదు చేయాల‌ని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించ‌డంతో గ‌త ఏడాది ఏప్రిల్‌లో దేశ్‌ముఖ్ మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement