Defence Minister Rajnath Singh: పాకిస్థాన్ భూభాగంలోకి భారత్ మిస్సైల్, రాజ్యసభలో వివరణ ఇచ్చిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నామని వెల్లడి
పాకిస్థాన్ భూభాగంలోకి భారత్ మిస్సైల్ దూసుకెళ్లిన ఘటనపై పార్లమెంట్ సాక్షిగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు.రాజ్యసభలో మాట్లాడుతూ.. మార్చి 9న రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించారు.
![Defence Minister Rajnath Singh: పాకిస్థాన్‌ భూభాగంలోకి భారత్‌ మిస్సైల్‌, రాజ్యసభలో వివరణ ఇచ్చిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నామని వెల్లడి](https://test1.latestly.com/wp-content/uploads/2020/09/Rajnath-Singh-Lok-Sabha.png)
పాకిస్థాన్ భూభాగంలోకి భారత్ మిస్సైల్ దూసుకెళ్లిన ఘటనపై పార్లమెంట్ సాక్షిగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు.రాజ్యసభలో మాట్లాడుతూ.. మార్చి 9న రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించారు. మిస్సైల్ యూనిట్లో రోజూవారీ తనిఖీలు నిర్వహిస్తుండగా.. పొరపాటున ఒక మిస్సైల్ దూసుకెళ్లింది. తర్వాతే అది పాక్ భూభాగంలో పడిందని తెలిసింది. ఈ ఘటన జరగడం విచారకం. కానీ, ఎలాంటి నష్టం జరగనందుకు సంతోషం.
పాక్ ఆరోపిస్తున్నట్లు ఈ ఘటనను.. మేం తమాషాగా చూడట్లేదు. మా ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే పొరపాటు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు.. అత్యున్నత విచారణకు ఆదేశించాం. విచారణ జరిగితే.. అసలు కారణం ఏంటో తెలిసేది’’ అని రాజ్నాథ్ తెలిపారు. ఈ ఘటనతో భారత క్షిపణి వ్యవస్థపై అనుమానాలు అక్కర్లేదన్న రక్షణ మంత్రి.. అది అత్యంత సురక్షితమైనదని సభకు హామీ ఇచ్చారు. ‘‘మా భద్రతా విధానాలు, ప్రోటోకాల్లు అత్యధిక క్రమాన్ని కలిగి ఉంటాయి. ఎప్పటికప్పుడు సమీక్షించబడతాయి. మన సాయుధ దళాలు సుశిక్షితమైనవి అని స్పష్టం చేశారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)