ISRO launches SSLV-D1: ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం చివరి దశలో గందరగోళం, ఉపగ్రహం నుంచి సిగ్నల్ అందకపోవడంతో, మిషన్ సందిగ్ధత
భారతదేశపు మొట్టమొదటి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) ప్రయోగం విజయవంతమైంది. అయితే మూడోదశలో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే సాంకేతిక సమస్యలతో ఉపగ్రహాల నుంచి షార్కు సిగ్నల్స్ అందకపోవడంతో రాకెట్ ప్రయోగంపై సందిగ్ధత ఏర్పడింది.
భారతదేశపు మొట్టమొదటి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) ప్రయోగం విజయవంతమైంది. అయితే మూడోదశలో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే సాంకేతిక సమస్యలతో ఉపగ్రహాల నుంచి షార్కు సిగ్నల్స్ అందకపోవడంతో రాకెట్ ప్రయోగంపై సందిగ్ధత ఏర్పడింది. దీనిపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. 'ఎస్ఎస్ఎల్వి-డి1 అన్ని దశల్లోనూ ఆశించిన స్థాయిలోనే పనితీరు కనబరిచింది. మిషన్ చివరి దశలో కొంత డేటా నష్టం జరిగింది. మేము దానిని విశ్లేషిస్తున్నాము. ఈ SSLV భూమి పరిశీలన ఉపగ్రహాన్ని , విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాన్ని మోసుకెళ్తుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ విషయాన్ని వెల్లడించింది. 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను 500 కి.మీ వరకు తక్కువ భూమి కక్ష్యలో చేర్చే మిషన్ను ఇస్రో ప్రారంభించింది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న SSLV మార్కెట్లో పెద్ద భాగం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.