Kerala: కేరళలో RSS కార్యాలయంపై బాంబు దాడి, ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపిన పోలీసులు

కేరళలో RSS కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. కన్నూర్‌ జిల్లా పయ్యన్నూర్‌లోని కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం దాడి చేయగా భవనం కిటికిలు దెబ్బతిన్నాయి. అయితే, ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే, దాడికి గల కారణాలు తెలియరాలేదు

Bomb hurled at RSS office in Kannur district (Photo-ANI)

కేరళలో RSS కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. కన్నూర్‌ జిల్లా పయ్యన్నూర్‌లోని కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం దాడి చేయగా భవనం కిటికిలు దెబ్బతిన్నాయి. అయితే, ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే, దాడికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే, సీపీఐ (ఎం) కార్యకర్తలో దాడికి పాల్పడ్డారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది. గత నెల 30న రాత్రి ఏకేజీ సెంటర్‌ వద్ద సీపీఐ (ఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయం బాంబు దాడి జరిగిన సంగతి విదితమే. ఇంతకు ముందు వయనాడ్‌లోని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ కార్యాలయంపై దాడి ఘటన చోటు చేసుకున్నది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement