No-Confidence Motion: లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీలు ఖరారు, ఈనెల 10న మణిపూర్ అంశంపై సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోదీ
లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ తేదీలు ఖరారు చేశారు. ఈనెల 8.9,10 తేదీల్లో లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈనెల 10న ప్రధాన మోదీ సమాధానం ఇవ్వనున్నారు.
New Delhi, August 1: లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ తేదీలు ఖరారు చేశారు. ఈనెల 8.9,10 తేదీల్లో లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈనెల 10న ప్రధాన మోదీ సమాధానం ఇవ్వనున్నారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ఉభయసభల్లో ప్రకటన చేయడం లేదని, అందుకే కేంద్ర సర్కార్పై అవిశ్వాసాన్ని ప్రవేశపెడుతున్నట్లు విపక్షాలు పేర్కొన్న విషయం తెలిసిందే. లోక్సభలో ఎంపీ గౌరవ్ గగోయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ బిర్లా ఆమోదించారు.
జూలై 20వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి రోజు ఉభయసభలు మణిపూర్ అంశం విషయంలో వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇవాళ తొమ్మిదో రోజు కూడా సభాకార్యక్రమాలు జరగలేదు.అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఎంపీ గౌరవ్ గగోయ్ నోటీసుపై 50 మంది సభ్యులు సంతకం చేశారు. లోక్సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ బలం 331. విపక్ష కూటమి ఇండియా బలం 144 మంది. అయితే ఈ తీర్మానాన్ని విపక్షం నెగ్గడం కుదరదు. కానీ మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడే విధంగా చేస్తుందని విపక్షాలు భావిస్తున్నాయి.