New York Shocker: న్యూయార్క్ లో గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు, వరుసగా రెండు వారాల్లో ఇది రెండో ఘటన

తెల్లవారుజామున రెండు కార్లలో వచ్చిన ఆరుగురు వక్తులు శ్రీ తులసి మందిర్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని పెద్ద సుత్తితో పగులకొట్టి ధ్వంసం చేశారు.

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో మరోసారి గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నెల 16న ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున రెండు కార్లలో వచ్చిన ఆరుగురు వక్తులు శ్రీ తులసి మందిర్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని పెద్ద సుత్తితో పగులకొట్టి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. 25-30 మధ్య వయసున్న ఆరుగురు వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారు అక్కడి నుంచి కార్లలో పారిపోయినట్లు చెప్పారు. నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement