PM Modi to Address Nation: సాయంత్రం 5 గంట‌ల‌కు జాతినుద్దేశించి ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్ర‌సంగం, కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడతారంటూ ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

PM Narendra Modi(Photo Credits: ANI)

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడతారంటూ ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ గురించి కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం దేశంలో కొవిడ్ రెండో ద‌శ త‌గ్గుముఖం పట్టిన‌ట్లే క‌నిపిస్తోంది. కేసులు రెండు నెల‌ల క‌నిష్ఠానికి ప‌డిపోయాయి. మ‌రోవైపు త‌మ ప్ర‌భుత్వ వ్యాక్సినేష‌న్ పాల‌సీపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మోదీ దానిపై కూడా మాట్లాడ‌తార‌ని స‌మాచారం. సుప్రీంకోర్టు కూడా వ్యాక్సిన్ పాల‌సీపై ప్ర‌భుత్వంపై వ్యక్తం చేసింది. దాని కోసం బ‌డ్జెట్‌లో కేటాయించిన 35 వేల కోట్లు ఏమ‌య్యాయ‌ని కూడా ప్ర‌శ్నించింది. వీటిపై ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో వివ‌ర‌ణ ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement