Udaipur beheading: టైలర్ హత్య ఘటనపై స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఉదయ్పూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడి
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఓ టైలర్ను క్రూరంగా హత్య చేసిన ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉదయ్పూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఓ టైలర్ను క్రూరంగా హత్య చేసిన ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉదయ్పూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. దర్జీని హత్య చేసిన ఇద్దరు నిందితులపై రాజస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని తెలిపారు. పోలీసులు అప్రమత్తంగా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. తీవ్రవాదం బాగా పెరిగిపోతుందన్నారు. నుపుర్ శర్మ సస్పెన్షన్ చేయడం కాదు.. ఆమెను అరెస్టు చేయాలని ఎంపీ ఓవైసీ డిమాండ్ చేశారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)