Karnataka Election 2023: సోనియా గాంధీ కర్ణాటక సార్వభౌమత్వం వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు

సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. సార్వ‌భౌమ‌త్వం అన్న ప‌దాన్ని వాడ‌డం ప‌ట్ల బీజేపీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని బీజేపీ డిమాండ్ చేసింది.ఈ నేప‌థ్యంలో ఈసీకి ఓ లేఖ రాసింది.

Sonia Gandhi during public meeting in Hubbali on May 6 (File Photo/ANI)

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ సంచలన కామెంట్స్‌ చేశారు. కర్నాటకలో ప్రచారంలో భాగంగా హుబలి సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ క‌ర్నాట‌క ప్ర‌తిష్ట‌, సార్వ‌భౌమ‌త్వానికి, స‌మ‌గ్ర‌త‌కు ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా కాంగ్రెస్ చూస్తుంద‌ని.. ఇందుకు భంగం కలిగించే వారిని ఎవరిని అనుమతించబోమని కామెంట్స్‌ చేశారు. అనంతరం, సోనియా వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు.

సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. సార్వ‌భౌమ‌త్వం అన్న ప‌దాన్ని వాడ‌డం ప‌ట్ల బీజేపీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని బీజేపీ డిమాండ్ చేసింది.ఈ నేప‌థ్యంలో ఈసీకి ఓ లేఖ రాసింది. సోనియాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని ఈసీని బీజేపీ కోరింది.

Here's ANI Tweet

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement