Presidential Elections 2022: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా, కార్యక్రమానికి హాజరయిన పలు పార్టీల నేతలు
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన నామినేషన్ను సోమవారం దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. అయితే నామినేషన్ దాఖలు సమయంలో కేటీఆర్ ముందు వరుసలో కూర్చున్నారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన నామినేషన్ను సోమవారం దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. అయితే నామినేషన్ దాఖలు సమయంలో కేటీఆర్ ముందు వరుసలో కూర్చున్నారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, కేటీఆర్, ఏ రాజా, సీతారాం ఏచూరి ముందు వరుసలో ఆశీనులై.. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తమ మద్దతును తెలిపారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ తరపున తనతో పాటు తమ ఎంపీలు హాజరవుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు కంటే ముందు కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు.