Tamil Nadu Elections 2024: తమిళనాడులో బీజేపీకి బిగ్ బూస్టింగ్, కాషాయం తీర్థం పుచ్చుకున్న 15 మంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరో మాజీ ఎంపీ

లోక్ సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె)కు చెందిన పదిహేను మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బుధవారం బీజేపీ పార్టీలో చేరారు.

Former DMK MP, 15 former Tamil Nadu MLAs join BJP amid Lok Sabha Polls (Photo-PTI)

లోక్ సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె)కు చెందిన పదిహేను మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బుధవారం బీజేపీ పార్టీలో చేరారు. కేంద్రమంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, ఎల్ మురుగన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో ఢిల్లీలో వారు బీజేపీలో చేరారు.

అనంతరం విలేకరు సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారని... ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు తమతో కలిసారని అన్నారు. తమిళనాడు ప్రజలు ఈ సారి బీజేపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లకు పైగా వస్తాయని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఎంపీ సీట్లు గెలుచుకుంటామని జోస్యం చెప్పారు. గత పదేళ్లుగా జరుగుతోన్న అభివృద్ధి కొనసాగాలని దేశంలోని ప్రతి పౌరుడు భావిస్తున్నాడన్నారు.

Here's PTI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement