ICC T20 World Cup 2024 Team: విరాట్ కోహ్లీ లేకుండా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ 2024 జట్టు ప్రకటన, భారత్ నుంచి ఆరుగురు ప్లేయర్లకు చోటు

ఇందులో ఆరుగురు టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఐసీసీ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.ఇక ఫైనల్‌ మ్యాచ్‌ హీరో విరాట్‌ కోహ్లికి చోటు దక్కలేదు.

Team India

ఐసీసీ తమ టీ20 వరల్డ్‌కప్‌ 2024 జట్టును ఇవాళ (జులై 1) ప్రకటించింది. ఇందులో ఆరుగురు టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఐసీసీ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.ఇక ఫైనల్‌ మ్యాచ్‌ హీరో విరాట్‌ కోహ్లికి చోటు దక్కలేదు.

ఐసీసీ జట్టులో భారత క్రికెటర్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభించింది. భారత్‌ తర్వాత అత్యధికంగా ఆఫ్ఘన్‌ క్రికెటర్లకు  ఐసీసీ జట్టులో చోటు దక్కింది. ఆ జట్టు నుంచి రహ్మానుల్లా గుర్బాజ్‌, ఫజల్‌హక్‌ ఫారూఖీ, రషీద్‌ ఖాన్‌లకు ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా నుంచి స్టోయినిస్‌.. వెస్టిండీస్‌ నుంచి పూరన్‌లకు ఛాన్స్‌ దక్కింది. 12వ ఆటగాడిగా సఫారీ స్పీడ్‌ గన్‌ నోర్జే ఎంపికయ్యాడు.

Here's News