Team India Victory Parade: బీసీసీఐ నుంచి 125 కోట్ల రూపాయల చెక్కును అందుకున్న టీమిండియా, వాంఖడే స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల మధ్య కన్నుల పండుగగా టీమిండియా విక్టరీ పరేడ్
వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా ఆటగాళ్లకు ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జనంతో ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024 విజేత టీమిండియా ఇవాళ స్వదేశం చేరుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా ఆటగాళ్లకు ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జనంతో ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది. అటు అరేబియా సముద్రం, ఇటు జనసముద్రం అన్నట్టుగా ఆ ప్రాంతం అంతా క్రికెట్ అభిమానులతో నిండిపోయింది.మెరైన్ డ్రైవ్ నుంచి ఆటగాళ్లు ప్రత్యేక ఓపెన్ టాప్ బస్సులో వాంఖెడే స్టేడియానికి చేరుకున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ఆఫీస్ బేరర్లు టీమ్ ఇండియాకు 125 కోట్ల రూపాయల చెక్కును అందించారు.టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్కు బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించిన సంగతి విదితమే. వీడియో ఇదిగో, అభిమానుల కోసం ట్రోఫీని పైకి ఎత్తిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ద్వయం
Here's News