IPL 2022: లక్నోపై విరుచుకుపడిన షమీ, ఐపీఎల్‌లో బోణీ కొట్టిన గుజరాత్‌ టైటాన్స్, 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం

ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రెండు కొత్త జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను విజయం వరించింది. బౌలింగ్‌లో మహమ్మద్‌ షమీ (3/25) మెరుపులకు.. బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌ సహకారం తోడవడంతో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

Mohammed Shami (Photo/IPL PTI)

ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రెండు కొత్త జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను విజయం వరించింది. బౌలింగ్‌లో మహమ్మద్‌ షమీ (3/25) మెరుపులకు.. బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌ సహకారం తోడవడంతో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన లక్నో నీర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. దీపక్‌ హుడా (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుష్‌ బదోనీ (41 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. గుజరాత్‌ బౌలర్లలో మహమ్మద్‌ షమీ 3, వరుణ్‌ అరోన్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 33; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌), వేడ్‌ (30), మిల్లర్‌ (30), రాహుల్‌ తెవాటియా (24 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అభినవ్‌ మనోహర్‌ (7 బంతుల్లో 15 నాటౌట్‌; 3 ఫోర్లు) రాణించారు. లక్నో బౌలర్లలో చమీర 2 వికెట్లు పడగొట్టాడు. షమీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement