Virender Sehwag: ప్లేయర్ల జెర్సీలపై టీమిండియా పేరు తీసేసి వెంటనే భారత్ అని రాయండి, మన దేశం అసలైన పేరు భారత్ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్

ప్రస్తుతం దేశంలో భారత్, ఇండియా అనే పేరుతో వివాదం నడుస్తోంది. అందులో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరాడు.మన దేశం పేరును భారత్ గా మార్చడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. పేరు అనేది మనలో గర్వాన్ని నింపేదిగా ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతాను.

Virender Sehwag. (Photo: @virendersehwag/Twitter)

ప్రస్తుతం దేశంలో భారత్, ఇండియా అనే పేరుతో వివాదం నడుస్తోంది. అందులో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరాడు.మన దేశం పేరును భారత్ గా మార్చడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. పేరు అనేది మనలో గర్వాన్ని నింపేదిగా ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. మనం భారతీయులం. ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు ఇచ్చిన పేరు. మన దేశం అసలైన పేరు భారత్ ను అధికారికంగా తిరిగి పొందడానికి ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది. వన్డే ప్రపంచకప్ లో మన ప్లేయర్ల జెర్సీలపై కూడా భారత్ అని ఉండాలని బీసీసీఐను, జైషాను కోరుతున్నా' అని ట్వీట్ చేశారు.

Here's Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement