Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం, గడ్డిమందు తాగి యువకుడు ఆత్మహత్య...11 నెలల క్రితమే పెళ్లి..వీడియో ఇదిగో
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బుర్రవేణి వేణు (27) వారం రోజుల క్రితం గడ్డి మందు సేవించగా నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులకు తెలుపగా వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బుర్రవేణి వేణు (27) వారం రోజుల క్రితం గడ్డి మందు సేవించగా నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులకు తెలుపగా వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
గడ్డిమందు అధిక మోతాదులో తీసుకోవడం వలన పొట్టలోని అవయవాల పైన తీవ్ర ప్రభావం చూపి చికిత్సకు బాడీ సహకరించకపోవడంతో నిన్న రాత్రి వేణు మరణించారు. 11 నెలల క్రితం భుంపెళ్లి మండలం రుద్రవరం గ్రామానికి చెందిన గీతను (23) వివాహం చేసుకోగా.. వేణు ఆకస్మికంగా ఆర్థిక ఇబ్బందులు తాళలేక గడ్డి మందు సేవించి మరణించడంతో కట్టుకున్న భార్య, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మేడ్చల్ రోడ్డుపై సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు, సిబ్బందితో వెళ్లి ఫారాలు తీసుకెళ్లిన మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి...వీడియో ఇదిగో
Here's Video: