Bio Asia 2024: బయోఏషియా సదస్సు ప్రారంభం నేడే.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికే నగరానికి చేరుకున్న ప్రతినిధులు
ఔషధ, జీవశాస్ర్తాల వార్షిక సదస్సు ‘బయోఏషియా-2024 సమ్మిట్’కు హైదరాబాద్ మళ్లీ వేదికైంది. మంగళవారం ఉదయం పది గంటలకు హెచ్ఐసీసీలో సదస్సు ప్రారంభం కానున్నది.
Hyderabad, Feb 27: ఔషధ, జీవశాస్ర్తాల వార్షిక సదస్సు ‘బయోఏషియా-2024 సమ్మిట్’కు (Bio Asia Summit 2024) హైదరాబాద్ మళ్లీ వేదికైంది. మంగళవారం ఉదయం పది గంటలకు హెచ్ఐసీసీలో సదస్సు ప్రారంభం కానున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఈ 21వ సదస్సులో 50 దేశాల నుంచి పరిశ్రమ, ప్రభుత్వాలకు చెందిన ప్రముఖులు, శాస్త్రవేత్తలు, రెగ్యులేటరీ బాడీ ప్రతినిధులు, విద్యావేత్తలు, పరిశోధకులు, వ్యవస్థాపకులు తదితర 3,000 మందికిపైగా పాల్గొంటున్నారు. సుమారు 200లకుపైగా కంపెనీలు తమ ఉత్పత్తులను ఈ సదస్సులో ప్రదర్శించనున్నాయి.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)