Hyderabad: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో ఓ ఇంట్లో రూ. 2 కోట్ల దొంగతనం, నిందితుడిని నాగపూర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు, ఇంట్లో పనిచేసే యువకుడిగా గుర్తింపు

నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి హిమాయత్ నగర్ లోని మినర్వా హోటల్ లేన్ లో ఉన్న ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ. 2 కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాలు దొంగిలించబడ్డాయి.ఇంటి యజమాని ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడు

Major Theft occurred under the Narayanguda police station limits

నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి హిమాయత్ నగర్ లోని మినర్వా హోటల్ లేన్ లో ఉన్న ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ. 2 కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాలు దొంగిలించబడ్డాయి.ఇంటి యజమాని ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడు. కేర్ టేకర్ అభయ్ కేడియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీహార్ కు చెందిన ఒక సేవకుడు ఈ దొంగతనం చేసినట్లు అనుమానిస్తున్నారు. నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

విలేఖరుల ముసుగులో అక్రమ దందా.. ఏడుగురిపై కేసు నమోదు, కారు సీజ్.. బెదిరింపులకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచన

ఇంటి యజమాని రోహిత్ కెడియా కూతురి పెళ్లి దుబాయ్‌లో ఉండటం వల్ల నాలుగు రోజుల క్రితం దుబాయ్ కు వెళ్ళాడు. ఇంట్లో పని చేసే 20 మందికి ఓ రూమ్ ఇచ్చారు. అక్కడే పని చేసే బీహార్‌కు చెందిన వ్యక్తి, ఇంకొకరి సహాయంతో ఈ నెల 11 అర్ధరాత్రి.. ఇంట్లో ఉన్న 20 లక్షల నగదు , డైమండ్స్ , గోల్డ్ మొత్తం 2 కోట్లు విలువ చేసే సొత్తు చోరీ చేశాడు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నారాయణగూడ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. సుశీల్‌ను నాగ్‌పూర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చోరీ చేసిన అనంతరం నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి నాగపూర్‌కు బయలుదేరాడు సుశీల్. అప్రమత్తమైన నారాయణగూడ పోలీసులు నాగ్‌పూర్ పోలీసుల సమన్వయంతో సుశీల్‌ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం నారాయణగూడ పోలీసుల అదుపులో నిందితుడు సుశీల్ ఉన్నారు.

హైదరాబాద్‌లో ఓ ఇంట్లో రూ. 2 కోట్ల దొంగతనం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement