Manish Sisodia: ఓటమిని అంగీకరిస్తున్నా..పార్టీ కార్యకర్తలు బాగా పోరాడారన్న ఆప్ నేత మనీష్ సిసోడియా, బీజేపీ అభ్యర్థికి అభినందనలు తెలిపిన సిసోడియా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది ఆప్. పదేళ్ల తర్వాత ఆప్ అధికారాన్ని కొల్పోగా బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకుంది

Manish Sisodia concedes his defeat from Jangpura constituency(ANI)

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది ఆప్. పదేళ్ల తర్వాత ఆప్ అధికారాన్ని కొల్పోగా బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకుంది(Delhi Assembly Elections). ఇక ఆప్ కీలక నేతలు మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) ఓటమి పాలయ్యారు.

జంగ్‌పురా నియోజకవర్గం పోటీ చేసిన మనీష్ సిసోడియా తన ఓటమిని అంగీకరించారు. పార్టీ కార్యకర్తలు బాగా పోరాడారు.. మనమంతా కష్టపడ్డాం. ప్రజలు కూడా మాకు మద్దతు ఇచ్చారు.

ఢిల్లీలో కమల వికాసం.. ముఖ్యమంత్రి రేసులో ముగ్గురి పేర్లు.. పూర్తి వివరాలు ఇవిగో..! 

కానీ, నేను 600 ఓట్ల తేడాతో ఓడిపోయాను అన్నారు. గెలిచిన అభ్యర్థికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ నియోజకవర్గం కోసం మంచిగా పనిచేస్తారని ఆశిస్తున్నాను అని చెప్పారు.

Manish Sisodia concedes his defeat from Jangpura constituency

#WATCH | AAP candidate from Jangpura constituency, Manish Sisodia concedes defeat, says, "Party workers fought well; we all did hard work. People have supported us as well. But, I lose by 600 votes. I congratulate the candidate who won. I hope he will work for the constituency." https://t.co/szW8leInSp pic.twitter.com/B1VVvsbfNI

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now