Telangana: మందుబాబులు విన్నారా ఈ న్యూస్.. తెలంగాణలో క్వార్టర్ లిక్కర్పై రూ.20.. బీరుపై రూ. 10 పెరిగింది, నేటి నుంచి కొత్త ధరలు అమల్లోకి
రాష్ట్రంలో మద్యం ధరలు మరోమారు పెరిగాయి. ఆర్డినరీ, మీడియం మద్యం 180 ఎంఎల్ లిక్కర్ (క్వార్టర్) బాటిల్పై రూ.20, ప్రీమియం మద్యం క్వార్టర్ బాటిల్పై రూ.40 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో మద్యం ధరలు మరోమారు పెరిగాయి. ఆర్డినరీ, మీడియం మద్యం 180 ఎంఎల్ లిక్కర్ (క్వార్టర్) బాటిల్పై రూ.20, ప్రీమియం మద్యం క్వార్టర్ బాటిల్పై రూ.40 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆర్డినరీ, మీడియం మద్యం 375 ఎంఎల్ (హాఫ్) బాటిల్పై రూ. 40, 750 ఎంఎల్ (ఫుల్) బాటిల్పై రూ.80 చొప్పున.. ప్రీమియం మద్యం హాఫ్ బాటిల్పై రూ.80, ఫుల్ బాటిల్పై రూ.160 చొప్పున పెంచింది. లిక్కర్తో పాటు వైన్, బీర్ల ధరలు కూడా పెరిగాయి. వైన్ క్వార్టర్ బాటిల్పై రూ.10, హాఫ్ బాటిల్పై రూ.20, ఫుల్ బాటిల్పై రూ.40 చొప్పున.. ప్రతి బీరుపై రూ.10 చొప్పున రేటు పెరిగింది. ఈ మేరకు బుధవారం ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ శాఖాపరమైన ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన రేట్లు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement