Telangana: మందుబాబులు విన్నారా ఈ న్యూస్.. తెలంగాణలో క్వార్టర్‌ లిక్కర్‌పై రూ.20.. బీరుపై రూ. 10 పెరిగింది, నేటి నుంచి కొత్త ధరలు అమల్లోకి

రాష్ట్రంలో మద్యం ధరలు మరోమారు పెరిగాయి. ఆర్డినరీ, మీడియం మద్యం 180 ఎంఎల్‌ లిక్కర్‌ (క్వార్టర్‌) బాటిల్‌పై రూ.20, ప్రీమియం మద్యం క్వార్టర్‌ బాటిల్‌పై రూ.40 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Liquor Representative Image (Photo Credits: Wikimedia Commons)

రాష్ట్రంలో మద్యం ధరలు మరోమారు పెరిగాయి. ఆర్డినరీ, మీడియం మద్యం 180 ఎంఎల్‌ లిక్కర్‌ (క్వార్టర్‌) బాటిల్‌పై రూ.20, ప్రీమియం మద్యం క్వార్టర్‌ బాటిల్‌పై రూ.40 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆర్డినరీ, మీడియం మద్యం 375 ఎంఎల్‌ (హాఫ్‌) బాటిల్‌పై రూ. 40, 750 ఎంఎల్‌ (ఫుల్‌) బాటిల్‌పై రూ.80 చొప్పున.. ప్రీమియం మద్యం హాఫ్‌ బాటిల్‌పై రూ.80, ఫుల్‌ బాటిల్‌పై రూ.160 చొప్పున పెంచింది. లిక్కర్‌తో పాటు వైన్, బీర్ల ధరలు కూడా పెరిగాయి. వైన్‌ క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10, హాఫ్‌ బాటిల్‌పై రూ.20, ఫుల్‌ బాటిల్‌పై రూ.40 చొప్పున.. ప్రతి బీరుపై రూ.10 చొప్పున రేటు పెరిగింది. ఈ మేరకు బుధవారం ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ శాఖాపరమైన ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన రేట్లు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement