YS Sharmila: అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన షర్మిల, ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసి బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించిన పోలీసులు

వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి, బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించగా.. రెండ్రోజుల చికిత్స అనంతరం వైఎస్ షర్మిల గారు ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు.ప్రజలపక్షాన న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తనను, తమ పార్టీ కార్యకర్తలను బందీలుగా చేశారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

File (Credits: Twitter/ANI)

వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి, బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించగా.. రెండ్రోజుల చికిత్స అనంతరం వైఎస్ షర్మిల గారు ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు.ప్రజలపక్షాన న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తనను, తమ పార్టీ కార్యకర్తలను బందీలుగా చేశారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

వైఎస్సార్‌ బిడ్డను పంజరంలో పెట్టి బంధించవచ్చని కేసీఆర్‌ అనుకుంటున్నారు. అది ఆయన తరం కాదు’అని స్పష్టం చేశారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా కేసీఆర్‌ పోలీసుల భుజాన తుపాకీ పెట్టి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలంటే గౌరవంలేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరిన కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారని మండిపడ్డారు.

Here's YSRTP Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Share Now
Advertisement