PM Modi in USA: భారత ప్రధాని అమెరికా టూర్, తొలి రోజు గ్లోబల్ కంపెనీల సీఈఓలతో చర్చ; రేపు వైట్హౌజ్లో మోదీకి ఆతిథ్యం ఇవ్వనున్న యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్
మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వాషింగ్టన్ డీసీలో ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశం కానున్నారు. క్వాల్ కామ్, అడోబ్, బ్లాక్ స్టోన్, జనరల్ అటామిక్స్, ఫస్ట్ సోలార్ కంపెనీల అధిపతులు ప్రధానమంత్రితో సమావేశమవుతారు. అలాగే మోదీ తన పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ను కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రేపు ప్రధాని నరేంద్ర మోదీకి వైట్హౌస్లో ఆతిథ్యం ఇవ్వనున్నారు. అమెరికాతో భారత ద్వైపాక్షిక సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పెట్టుబడులు, రక్షణ రంగాలు, అఫ్ఘానిస్థాన్లోని పరిస్థితులు, ఉగ్రవాద నిరోధం, ఇండో-పసిఫిక్, వాతావరణ మార్పులు వంటి అంశాలపై బైడెన్తో మోదీ చర్చలు జరపనున్నట్లు సమాచారం.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement