Asia Cup 2022: కోహ్లి పరుగుల వరద.. టోర్నీలోనే అత్యధిక స్కోరు నమోదు.. ఆఫ్ఘాన్ పై భారత్ విజయ దుందుభి

ఆసియా కప్ ను భారత్ విజయంతో ముగించింది. సూపర్-4లోని ఆఖరి పోరులో ఆఫ్ఘనిస్తాన్ పై 101 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కొంతకాలంగా ఫాంలో లేని విరాట్.. ఈ మ్యాచ్ లో తన సత్తా చాటాడు. 61 బంతుల్లో 122 (నాటౌట్) పరుగులు చేసి రాణించాడు.

Dubai, September 9: ఆసియా కప్ ను భారత్ విజయంతో ముగించింది. సూపర్-4లోని ఆఖరి పోరులో ఆఫ్ఘనిస్తాన్ పై 101 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కొంతకాలంగా ఫాంలో లేని విరాట్.. ఈ మ్యాచ్ లో తన సత్తా చాటాడు. 61 బంతుల్లో 122 (నాటౌట్) పరుగులు చేసి రాణించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టోర్నీలో ఇప్పటివరకూ నమోదైన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అగ్నిప్రమాదం, స్డేడియం ఎంట్రన్స్ వద్ద ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు

తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులను మాత్రమే చేసింది. దీంతో విజయగర్వంతో భారత్  సిరీస్ నుంచి నిష్క్రమించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement