IPL 2025 Retentions: వామ్మో, ఈ ఆటగాడికి ఏకంగా రూ.21 కోట్లు వెచ్చించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన హెన్రిచ్ క్లాసెన్‌

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. ప్రస్తుతం రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా నవంబర్‌ చివరి వారంలో జరిగే వేలంలో పాల్గొంటారు.

heinrich klaasen (Photo/X)

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. ప్రస్తుతం రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా నవంబర్‌ చివరి వారంలో జరిగే వేలంలో పాల్గొంటారు.

ఐపీఎల్ రిటెన్షన్‌లో అన్ని జట్ల ఆటగాళ్ల జాబితా ఇదిగో, మిగతా ఆటగాళ్లకు నవంబర్‌ చివరి వారంలో వేలం

ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు పలువురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు భారీ ధరకు దక్కించుకున్నాయి. విరాట్ కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ.21 కోట్లు వెచ్చించి అట్టిపెట్టుకుంది. అయితే విరాట్ రికార్డును బద్దలు కొడుతూ హెన్రిచ్ క్లాసెన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఏకంగా రూ.23 కోట్లతో రిటెయిన్ చేసుకుంది. దీంతో ఐపీఎల్ రిటెయిన్‌లో అత్యధిక ఖరీదైన ఆటగాడిగా క్లాసెన్ నిలిచాడు. ఇంతకు ముందు రూ.17 కోట్లతో అత్యధిక రిటెన్షన్‌ ధర పలికిన ఆటగాడి కోహ్లీ ఉండేవాడు. ఆ రికార్డును క్లాసెన్ చెరిపివేశాడు.

రిటెన్షన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు..

1. హెన్రిచ్ క్లాసెన్ (SRH) - రూ.23 కోట్లు

2. విరాట్ కోహ్లీ (RCB) - రూ.21 కోట్లు

3. నికోలస్ పూరన్ (LSG)- రూ.21 కోట్లు

4. పాట్ కమిన్స్ (SRH), సంజు శాంసన్ (RR), యశస్వి జైస్వాల్ (RR), రషీద్ ఖాన్ (GT), జస్ప్రీత్ బుమ్రా (MI), రుతురాజ్ గైక్వాడ్ (CSK), రవీంద్ర జడేజా (CSK) వీళ్లందరినీ ఆయా యాజమాన్యాలు రూ.18 కోట్ల మేర వెచ్చించి అట్టిపెట్టుకున్నాయి.

5. శశాంక్ సింగ్‌ను రూ.5.5 కోట్లకు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను రూ.4 కోట్లకు పంజాబ్ కింగ్స్ రిటెయిన్ చేసుకుంది

6. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సునీల్ నరైన్, ఆండ్ర్యూ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిని రిటెయిన్ చేసుకుంది.ఇక రింకూ సింగ్‌కు రూ.13 కోట్లు వెచ్చించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

PM Modi Takes Holy Dip at Triveni Sangam: వీడియో ఇదిగో, పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం ఆచరించిన ప్రధాని మోదీ, నేటి వరకు 39 కోట్ల మంది పుణ్యస్నానాలు

Delhi elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్, త్రిముఖ పోరులో గెలిచేది ఎవరో!

Andhra Pradesh: ఏలూరులో దారుణం, ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా రేడియేషన్ తట్టుకోలేక మహిళ మృతి, సుష్మితా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆందోళన

PM Modi Speech in Lok Sabha: పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ

Share Now