Tokyo 2020: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి స్వర్ణం, జావెలెన్ త్రోలో దేశానికి పసిడి పతకం అందించిన నీరజ్ చోప్రా, ఫైనల్లో 87.58 మీటర్లు విసిరి ఘనత సాధించిన నీరవ్
వందేళ్ల కలను నిజం అవుతూ.. టోక్యో ఒలింపిక్స్లో (Tokyo Olympics 2020) భారత్కు తొలి స్వర్ణం లభించింది. జావెలెన్ త్రోలో నీరజ్ చోప్రా దేశానికి స్వర్ణ పతకం (Neeraj Chopra Wins Historic Gold Medal) అందించాడు. ఫైనల్లో 87.58 మీటర్లు విసిరి ఈ ఘనత సాధించాడు.
టోక్యో ఒలింపిక్స్లో (Tokyo Olympics 2020) భారత్కు తొలి స్వర్ణం లభించింది. జావెలెన్ త్రోలో నీరజ్ చోప్రా దేశానికి స్వర్ణ పతకం (Neeraj Chopra Wins Historic Gold Medal) అందించాడు. ఫైనల్లో 87.58 మీటర్లు విసిరి ఈ ఘనత సాధించాడు.
ఒలింపిక్స్లో 13 ఏళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో భారత్కు స్వర్ణం లభించింది. 2008 ఒలింపిక్స్లో అభినవ్ బింద్రాకు షూటింగ్లో భారత్కు స్వర్ణం రాగా, ఈసారి నీరజ్ చోప్రా పసిడి పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు. అథ్లెటిక్స్లో భారత్కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు.
మొదటి అవకాశంలోనే నీరజ్ 87.03 మీటర్లు విసిరి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత మరింత తన రికార్డును మరింత మెరుగు పర్చుకున్నాడు. ఈ సారి ఈటెను 87.58 మీటర్లు విసిరి పతక పోటీలో మరింత ముందుకెళ్లాడు.
మూడోసారి మాత్రం 76.79కి పరిమితం అయ్యాడు.ఆ తర్వాత రెండు ఫౌల్స్ పడ్డాయి. ఆరో రౌండ్లో 84.24 మీటర్లు విసిరాడు. దీంతో పోటీలో పాల్గొన్న అథెట్లలో అత్యధిక మీటర్లు (87.03 మీటర్లు)విసిరిన ఆటగాడిగా నిలిచి స్వర్ణ పతకం ముద్దాడాడు.
Here's SAIMedia Tweet
నీరజ్ తర్వాత చెక్ రిపబ్లిక్కు చెందిన జాకూబ్(86.67 మీటర్లు)కు రజతం దక్కగా అదే దేశానికి చెందిన మరో అథ్లెట్ విటెడ్జ్స్లావ్(85.44 మీటర్లు)కు కాంస్యం సొంతమైంది. ఆసియా, కామన్వెల్త్లో స్వర్ణ పతకాలు ముద్దాడిన నీరజ్ ఒలింపిక్స్ అర్హత పోటీల్లోనూ అగ్ర స్థానంలో నిలిచాడు.
అతడు 2021 మార్చిలో 88.07మీ, 2018, ఆసియా క్రీడల్లో 88.06మీ, 2020జనవరిలో దక్షిణాఫ్రికాలో 87.87 మీ, 2021 మార్చిలో ఫెడరేషన్ కప్లో 87.80మీ, 2018, మేలో దోహా డైమండ్ లీగ్లో 87.43 మీ, 2021 జూన్లో కౌరెటనె గేమ్స్లో 86.79మీటర్లు ఈటెను విసిరి రికార్డులు సృష్టించాడు.
నీరజ్ గోల్డ్తో టోక్యో ఒలింపిక్స్లో ఇండియా సాధించిన పతకాల సంఖ్య ఏడుకు చేరుకున్నది. రెజ్లింగ్ రవికుమార్ దహియాకు సిల్వర్, భజరంగ్ పూనియాకు బ్రాంజ్ మెడల్స్ దక్కాయి. ఇక వెయిట్లిఫ్టింగ్లో మీరాభాయి చానుకు సిల్వర్ దక్కగా.. బ్యాడ్మింటన్లో పీవీ సింధుకు బ్రాంజ్ వచ్చింది. బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్కు కాంస్యం చిక్కింది. ఇండియన్ మెన్స్ హాకీ టీమ్కు కూడా బ్రాంజ్ మెడల్ వచ్చిన విషయం తెలిసిందే.
హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్ 24న జన్మించాడు. చంఢీఘర్లోని డీఏవీ కాలేజ్లో చదువుకున్న నీరజ్ చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్గా పనిచేస్తున్నాడు. 2018 ఏషియన్ గేమ్స్లో జావెలిన్ త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు.
ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్వెల్త్ గేమ్స్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)