ACB Raids in Jogi Ramesh Residence: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఉదయం 5 గంటల నుంచి తనిఖీలు.. అగ్రి గోల్డ్ భూములకు సంబంధించే ఈ దాడులు
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున నుంచి ఏసీబీ సోదాలు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది.
Vijayawada, Aug 13: మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున నుంచి ఏసీబీ సోదాలు (ACB Raids) చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. రమేష్ ఇంట్లో ఉన్న పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. రమేష్ ఇంటి ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వీడియోలను బట్టి తెలుస్తుంది.
అగ్రి గోల్డ్ భూముల విషయంలో..
అగ్రి గోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఆరోపణలు వచ్చాయి. అక్రమంగా భూముల రిజిష్ట్రేషన్ చేయించుకున్నట్టు చాలామంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.