Chittoor Crime: పరాయి మహిళతో శృంగారం చేస్తుంటే, పొరపాటున చూసిన బాలుడి మర్మాంగాలపై కొట్టి కడతేర్చిన సొంత బాబాయి, హత్య కేసు మిస్టరీని ఛేదించిన చిత్తూరు పోలీసులు

బాలుడు ఉదయ్‌ కిరణ్‌ తనకు స్వయానా బాబాయి అయిన కె.సహదేవ, వారి సమీప బంధువు అయిన రాజేశ్వరితో ఏకాంతంగా ఉండడాన్ని గమనించాడు. తమ వివాహేతర సంబంధం గురించి పిల్లాడు బయటకు చెప్తాడనే భయంతో ఇద్దరూ కలిసి ఉదయ్‌ కిరణ్‌ మర్మాంగాలపై కొట్టారు. ఆ తర్వాత టవల్‌తో గొంతు బిగించి చంపేశారు.

Crime | Representational Image (Photo Credits: Pixabay)

చిత్తూరు, మార్చి 20: చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన ఓ బాలుడి హత్యా కేసు మిస్టరీని పోలీసులు చేదించారు.  తొలుత  బాలుడు చెట్టు కొమ్మకు ఉరేసుకున్నట్లుగా కనిపించడంతో ఆత్మహత్యగా భావించారు. కానీ, పోలీసులు విచారణ చేపట్టగా అది హత్యగా తేలింది. ఆ హత్యకు దారి తీసిన పరిస్థితులను స్థానిక పోలీసులు వెల్లడించారు. 10 రోజుల క్రితం జరిగిన ఈ హత్య కేసు వివరాలను మదనపల్లి డీఎస్పీ మీడియాకు వెల్లడించారు.

చిత్తూరు జిల్లా కలిగిరి మండలంలోని అద్దవారిపల్లికి చెందిన కె.రవి, తులసి దంపతుల కుమారుడు ఎనిమిదేళ్ల ఉదయ్‌ కిరణ్‌. ఈ నెల 11న శుక్రవారం నుంచి కనిపించకపోవడంతో 12వ తేదీన తల్లి కలికిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అదే రోజు సాయంత్రం బాలుడు అద్దవారిపల్లి సమీపంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.

 

Ex-Student Stabs Teacher: 30 ఏళ్ల క్రితం అవమానించినందుకు టీచర్‌ ను చంపేసిన స్టూడెంట్, 101 కత్తిపోట్లు పొడిచి కిరాతకంగా హతమార్చిన విద్యార్ధి, 16 నెలల పాటూ గాలించి పట్టుకున్న బెల్జియం పోలీసులు

11న సాయంత్రం బాలుడు ఉదయ్‌ కిరణ్‌ తనకు స్వయానా బాబాయి అయిన కె.సహదేవ, వారి సమీప బంధువు అయిన రాజేశ్వరితో ఏకాంతంగా ఉండడాన్ని గమనించాడు. తమ వివాహేతర సంబంధం గురించి పిల్లాడు బయటకు చెప్తాడనే భయంతో ఇద్దరూ కలిసి ఉదయ్‌ కిరణ్‌ మర్మాంగాలపై కొట్టారు. ఆ తర్వాత టవల్‌తో గొంతు బిగించి చంపేశారు. ఉరేసుకుని చనిపోయినట్లుగా నమ్మించడానికి అర్ధరాత్రి శవాన్ని గ్రామ సమీపంలోని వేప చెట్టుకు తువ్వాలుతో వేలాడదీశారు.

ఫిర్యాదు అందగానే హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం సీఐ నాగార్జున రెడ్డి రంగంలోకి దిగారు. ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. కేసులో చాలా అనుమానాలు ఉండడంతో పక్కా సాక్ష్యాధారాలను సేకరించడానికి పోలీసులు చాలా మదన పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు నిందితులను గుర్తించి శనివారం అరెస్టు చేసి రిమాండుకు పంపారు. సీఐ నాగార్జున రెడ్డి, కలకడ, కేవీ పల్లె వాల్మీకిపురం ఎస్‌ఐలు రవిప్రకాష్‌ రెడ్డి, కేవీ పల్లి ఎస్సై బాలకృష్ణ, వాయల్పాడు ఎస్సై బిందుమాధవి, ఏఎస్ఐ మధుసూదనా చారిలతోపాటు పోలీసు సిబ్బందిని చిత్తూరు ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ రవి మనోహరాచారి వివరించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Vizag Astrologer Murder Case: విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు, పూజలు చేస్తానంటూ ఇంటికి వెళ్లి మహిళపై అత్యాచారం, అందుకే దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

Brutual Murder at Bhupalapally: మేడిగడ్డ కుంగుబాటు.. కేసీఆర్‌పై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య, భూపాలపల్లిలో లింగమూర్తిని దారుణంగా చంపేసిన దుండగులు, కేటీఆర్ ఆదేశాలతోనే హత్య జరిగిందని మృతుడి భార్య ఆవేదన

Nellore DIG Kiran: వేరే మహిళతో న్యూడ్‌గా ఉన్న వీడియోలను భార్యకు పంపిన నెల్లూరు డీఐజీ కిరణ్, పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Share Now