Sri Rama Navami Celebrations: భద్రాద్రిలో కన్నులపండువగా శ్రీరామనవమి వేడుకలు, రెండేళ్ల తర్వాత ప్రత్యక్షంగా భక్తులకు నేరుగా తిలకించే అవకాశం, వేలాదిగా చేరుకుంటున్న భక్తులు

భద్రాచలంలో (Badrachalam) రాములోరి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు (Sri ramanavami) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిపేందుకు ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిథిలా స్టేడియంలో (Mithila stadium) జరగనున్న కల్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు.

Hyderabad, April 10: భద్రాచలంలో (Badrachalam) రాములోరి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు (Sri ramanavami) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిపేందుకు ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిథిలా స్టేడియంలో (Mithila stadium) జరగనున్న కల్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం 12 గంటలకు…పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సముహూర్తంలో…శ్రీరాముడు (Sriramudu), సీతాదేవికి కల్యాణం నిర్వహించనున్నారు. ఈ కమనీయ వేడుకను తిలకించేందుకు తెలంగాణ నుంచే కాదు, ఏపీ, చత్తీస్‌గడ్‌, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

Sri Rama Navami 2022: శ్రీరామనవమి రోజు ఈ పనులు చేశారో, హనుమంతుడి ఆగ్రహానికి గురవుతారు, జాగ్రత్త...

10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు రామయ్య కల్యాణ కమనీయ దృశ్యాలను కనులారా వీక్షించనున్నారు భక్తులు. ఉదయం 9.30 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను మిథిలాస్టేడియంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తరలిస్తారు. కరోనాతో రెండేళ్ల పాటు జగదాబిరాముడి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్షంగా తిలకించలేకపోయారు. దీంతో ఈసారి కనులారా వీక్షించేందుకు వేలాది మంది భద్రాచలం చేరుకున్నారు. సోమవారం రాములవారి పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దేవస్థానం అధికారులు.

Ram Navami Wishes: శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపే కోట్స్, స్నేహితులకు, బంధువులకు, కుటుంబసభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ఈ మెసేజ్‌స్ ద్వారా చెప్పేయండి

భద్రాచలంలో రామాలయం పరిసరాలు, గోదావరి స్నానఘట్టాలు, కరకట్ట ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపిస్తోంది. రెండు లక్షల 50 వేల మంది తరలివస్తారని అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియం వెలుపల నిల్చుని కల్యాణోత్సవం వీక్షించేలా టీవీలు అమర్చారు. గ్యాలరీల్లో కూలర్లు బిగించారు. ఎండదెబ్బ తగలకుండా.. తాగు నీటితో పాటు మజ్జిగ అందిస్తున్నారు. తలాంబ్రాలు, లడ్డూ ప్రసాదాల కోసం పట్టణంలో 24 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీ పోలీస్‌ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా నీడలో.. సీతారాముల కల్యాణోత్సవం జరగనుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Cheruvu Gattu Jatara:నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు..జడల రామలింగేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు, వీడియో ఇదిగో

Fire On Panakala Swamy Hill: మంగళగిరి కొండపై మంటలు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఘోరం.. వ్యాపించిన దావానలం.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న ప్రజలు.. అనూహ్యంగా వాటంతట అవే ఆరిపోయిన మంటలు.. పానకాల స్వామి మహిమేనంటున్న భక్తులు (వీడియో)

Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు, చంద్రబాబు సర్కారుపై మండిపడిన పెద్దిరెడ్డి, ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు చేశారని వెల్లడి

Peddireddy Ramachandra Reddy: 25ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం, అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వారిపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Share Now