CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్...ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం దీనికి కారణం బీఆర్ఎస్ పాపాత్ములే కారణం అని మండిపడ్డారు. రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా చెప్పాలన్నారు.

BRS Govt Provided Rythu Bharosa To Uncultivated Lands Says CM Revanth Reddy(video grab)

Hyd, December 21:  సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్...ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం దీనికి కారణం బీఆర్ఎస్ పాపాత్ములే కారణం అని మండిపడ్డారు. రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా చెప్పాలన్నారు.

రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు రైతుబంధు తెచ్చారని, అయితే, గత ప్రభుత్వం రైతు బంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. తాము ఇచ్చే రైతు భరోసాపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు. రైతులను ఆదుకునే విషయంలో కాంగ్రెస్ సర్కారు ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.

మేము ఏడాదిలో రూ లక్ష 27 వేల కోట్ల అప్పు చేస్తే రాష్ట్రం మొత్తం అప్పు రూ 8 లక్షల 38 వేల కోట్లు ఉండాలి...కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు రూ. 7 లక్షల 22 వేల కోట్లు అన్నారు. ప్రతినెలా రూ.6 వేల 500 కోట్ల అప్పులు కడుతున్నాం అన్నారు. వాళ్ల లెక్క మేము అప్పులు తెచ్చి గజ్వేల్, మొయినాబాద్, జాన్వాడ లో ఫామ్ హౌజ్ లు కట్టుకోలేదు అన్నారు. వాళ్ళు చేసిన అప్పులు చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు.  రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్ 

రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు రైతుబంధు తెచ్చారని, అయితే, గత ప్రభుత్వం రైతు బంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. సాగులోలేని భూములకు రైతు బంధు ఇచ్చిందని చెప్పారు. రూ.22,600 కోట్ల కోట్ల రైతు బంధు ద్వారా ఆయాచిత లబ్ధి చేశారని అన్నారు. రియల్‌ ఎస్టేట్‌, పారిశ్రామికవేత్తలకూ రైతు బంధు ఇచ్చారని తెలిపారు.

Telangana CM Revanth Reddy on Rythu Bharosa

కీలకమైన రైతు బంధుపై చర్చ జరిగితే ప్రతిపక్ష నేత సలహాలు ఇస్తారని అనుకున్నానని అన్నారు. బీఆర్ఎస్‌కు ప్రతీదీ వ్యాపారమేనని అన్నారు. రైతుల బలవన్మరణాలపై బీఆర్ఎస్‌ నేతలు అసత్యాలు చెబుతున్నారని తెలిపారు. రైతులకు బీఆర్ఎస్‌ క్షమాపణలు చెప్పాలని అన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Advertisement
Advertisement
Share Now
Advertisement