Shankar Rao Convicted:రెండు కేసుల్లో దోషిగా తేలడంతో కోర్టులోనే సృహతప్పిన మాజీమంత్రి శంకర్రావు, శిక్ష రద్దు చేసి జరిమానాతో సరిపెట్టిన కోర్టు
మాజీమంత్రి శంకర్రావు(Ex-minister Shankar Rao )ను రెండు కేసుల్లో దోషి(convicted)గా తేల్చింది ప్రజా ప్రతినిధుల కోర్టు. భూ వివాదానికి(Land case) సంబంధించి బెదిరించారన్న ఆరోపణలతో షాద్నగర్(Shadnagar)లో 2015లో ఓ కేసు నమోదైంది.
Hyderabad January 13: మాజీమంత్రి శంకర్రావు(Ex-minister Shankar Rao )ను రెండు కేసుల్లో దోషి(convicted)గా తేల్చింది ప్రజా ప్రతినిధుల కోర్టు. భూ వివాదానికి(Land case) సంబంధించి బెదిరించారన్న ఆరోపణలతో షాద్నగర్(Shadnagar)లో 2015లో ఓ కేసు నమోదైంది. ఓ మహిళ ఇంట్లోకి అక్రమంగా చొరబడి బెదిరించారని మరో కేసు గతంలో నమోదైంది. ఈ రెండు కేసుల్లో విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధులు కోర్టు(MLA and MP Special Court)ముందుగా ఆయనకి ఆరు నెలలు జైలు శిక్ష(6 months jail term) విధించింది. తరువాత తీర్పుని కొట్టివేసి జరిమానా విధించింది.
తొలుత ఈ రెండు కేసులు విచారించిన కోర్టు ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించడంతో శంకర్రావు కోర్టు హాలులోనే స్పృహ తప్పి() పడిపోయారు. దీంతో అక్కడి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆయనను లేపి నీళ్లు తాగించడంతో కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు(MLA and MP Special Court)ను మార్చింది. ఓ కేసులో రూ.2 వేలు, మరో కేసులో రూ.1,500 జరిమానా(penalty) చెల్లించాలని ఆదేశించింది. ఈ రెండు కేసులతో పాటు మరోకేసు కూడా షాద్ నగర్ లో నమోదైంది. అయితే, దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో.. న్యాయస్థానం ఆ కేసుని కొట్టవేసింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)