Layout Regularisation Scheme: మధ్య తరగతి ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్, లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం గడువు మార్చి 31 వరకు పెంపు
తెలంగాణలో లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులపై రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 లోగా దరఖాస్తులకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.
Hyd, Feb 26: తెలంగాణలో లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులపై రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 లోగా దరఖాస్తులకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే అవుట్లను (LAYOUT REGULARIZATION SCHEME) క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో.. 20 లక్షల మంది దిగువ, మధ్య తరగతి వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు మేలు కలగనుంది.గతంలో రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. సోమవారం ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం (Telangana govt) దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను (Land Regularisation Scheme LRS 2020
) చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పెండింగులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అప్పట్లో ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది.
ఈ నెల 27 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అమలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిందే ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం). ప్రభుత్వ విధివిధానాలు పాటించకుండా నిర్మించిన లే అవుట్లు, అక్రమ స్థలాల్లో నిర్మించిన లే అవుట్లను అన్ అప్రూవుడ్ లే అవుట్లు అంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇలాంటి స్థలాలను తప్పకుండా క్రమబద్ధీకరించుకోవాలి. ఇందుకోసం 2020లో ఎల్ఆర్ఎస్-2020 (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2020) పేరుతో మార్గదర్శకాలను విడుదల చేసింది.
దీని ప్రకారం.. అధికారిక లేఅవుట్లో పది శాతం స్థలాన్ని ఖాళీగా వదలాల్సి ఉంటుంది. కానీ.. అనధికారిక లేఅవుట్లలో ఖాళీ స్థలం ఉండదు. దీంతో జనావాసాల్లో సౌకర్యాలు సరిగా ఉండవని, అలాంటి లేఅవుట్లలోని ఇళ్ల స్థలాల నుంచి 0.14శాతం ఓపెన్ ల్యాండ్ ఛార్జీలను వసూలు చేస్తారు. ఆ డబ్బుతో కొంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి.. అనధికార లేఅవుట్లోని కాలనీకి కేటాయించాలన్నది ముఖ్య ఉద్దేశం. కానీ.. జీహెచ్ఎంసీ ప్రణాళిక విభాగం ఎల్ఆర్ఎస్ను ఆదాయ వనరుగానే చూస్తోంది. ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ పథకం కింద రూ.100కోట్లకుపైగా రుసుము వసూలు చేయగా, అందులో ఒక్క రూపాయిని కూడా ఉద్దేశించిన లక్ష్యం కోసం వెచ్చించలేదు. అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తుల్లో అర్హమైన వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
క్రమబద్ధీకరణ ఛార్జీలు (చదరపు గజం రేటు)
రూ. 3,000 కంటే తక్కువ ఉన్న సబ్-రిజిస్ట్రార్ విలువ 20 శాతం ఉంటుంది.
రూ. 3,001 -రూ. 5,000 మధ్య 30 శాతం
రూ. 5,001 -రూ. 10,000 మధ్య 40 శాతం
రూ. 10,001 -రూ. 20,000 50 శాతం
రూ. 20,001 -రూ. 30,000 మధ్య 60 శాతం
రూ. 30,001 -రూ. 50,000 మధ్య 80 శాతం
చదరపు గజం సబ్-రిజిస్ట్రార్ విలువ రూ. 50,000 పైన 100 శాతం ఉంటుంది.
పై ఛార్జీలకు అదనంగా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణలో నాలా(వ్యవసాయ భూమిని వ్యవసాయేతర వినియోగానికి మార్చడానికి) రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆమోదం పొందని లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం అందుబాటులో లేనట్లైతే ఆగస్టు 26 నాటికి ఉన్న ధరకు బదులుగా, ప్లాట్ రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న ప్లాట్ విలువలో 14 శాతం చొప్పున ప్రో-రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)