Fire Accident In Kukatpally: కూకట్‌ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు (వీడియో)

హైదరాబాద్ కూకట్‌ పల్లిలోని ప్రశాంత్ నగర్‌ లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే ఎంఎన్ పాలిమర్స్‌ కంపెనీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Fire Accident In Kukatpally (Credits: X)

Hyderabad, Feb 24: హైదరాబాద్ (Hyderabad) కూకట్‌ పల్లిలోని ప్రశాంత్ నగర్‌ లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే ఎంఎన్ పాలిమర్స్‌ కంపెనీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఘటన స్థలానికి వెంటనే చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలకు పైగా శ్రమించి మంటలు ఆర్పారు. మంటలను చూసి కార్మికులు బయటకి పరిగెత్తడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని, ఆ మంట త్వరగా ఆవరణలో నిల్వ చేసిన ముడి పదార్థాలు, పూర్తయిన వస్తువులకు వ్యాపించిందని తెలుస్తోంది. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు జరగలేదు. ఆర్థిక నష్టం ఎంత అనేది ఇంకా తెలియరాలేదు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్, ప్రమాద ఘటనపై ఆరా, ఎస్‌ఎల్‌బీసీ డ్రోన్ విజువల్స్ ఇవే  

Here's Video:

నెల కిందట కూడా..

హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌ కాలనీలో (KPHB) నెల రోజుల కిందట కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కేపీహెచ్‌బీలోని అర్జున్‌ థియేటర్‌ సమీపంలో ఉన్న కంచుకోట టిఫిన్‌ సెంటర్‌ లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో హోటల్‌లో ఉన్న ఫర్నీచర్‌ మొత్తం అగ్నికి ఆహుతైంది. హోటల్‌ వెలుపల ఆపి ఉంచిన రెండు మోటారు సైకిళ్లు కూడా దగ్ధమయ్యాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో బాధితులు బతికే అవకాశం లేదు, లోపల పరిస్థితి దారుణంగా ఉందన్న మంత్రి జూపల్లి, వందలాది మందితో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement